ఆ.. గ్రామంతో 40 ఏళ్ల అనుబంధం

సొంత గ్రామంలో కల్యాణ మండపం నిర్మించడం అమరా శ్రీరాములు శ్రేష్ఠి గొప్ప మనసుకు నిదర్శనం

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఎమ్మెల్యే రామకృష్ణతో కల్యాణ మండపం ప్రారంభించిన మంత్రి ఆనం, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల‌

ఆ..గ్రామంతో 40 ఏళ్ల అనుబంధం

  • సొంత గ్రామంలో కల్యాణ మండపం నిర్మించడం అమరా శ్రీరాములు శ్రేష్ఠి గొప్ప మనసుకు నిదర్శనం
  • రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
  • ఎమ్మెల్యే రామకృష్ణతో కల్యాణ మండపం ప్రారంభించిన మంత్రి

దాచూరు గ్రామంతో తనకు 40 ఏళ్ల అనుబంధం వుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్‌ అమరా శ్రీరాములు శ్రేష్టి తన సతీమణి అమరా వసుంధరమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు. తొలుత గ్రామానికి విచ్చేసిన మంత్రి, ఎమ్మెల్యేకి స్థానిక గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… 1985నుంచి దాచూరు గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం వుందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తనకు గ్రామంలోని ప్రతి కుటుంబం అండగా నిలిచిందన్నారు. సొంత గ్రామానికి ఏదైనా మంచిపని చేయాలనే ఆశయంతో అమరా శ్రీరాములు శ్రేష్టి అత్యంత సుందరంగా ఈ కల్యాణ మండపాన్ని గ్రామస్థుల కోసం నిర్మించడం ఆయన ఉదారత, గొప్పమనసుకు నిదర్శనంగా మంత్రి కొనియాడారు. ఈ మండపాన్ని చుట్టుపక్కల గ్రామాలవారు కూడా వినియోగించుకోవాలని సూచించారు. జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కల్యాణ మండపం నిర్మాణదాత అమరా శ్రీరాములు శ్రేష్టి, అమరా శరత్‌బాబు, రాచపూటి పెంచలకుమార్‌, అమరా కుటుంబసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *