టీడీపీ వేధింపులపై కొడవలూరులో ధ్వజమెత్తిన మాజీ మంత్రులు కాకాణి, ప్రసన్న
పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు
చంద్రబాబుకి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఏవోల తొలగింపు.. ఎస్సీ మహిళా సర్పంచులపై తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న వేదింపులు ఆపాలంటూ.. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో… మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావు అధ్యక్షతన.. కోవూరు నియోజకవర్గం.. కొడవలూరు మండల కేంద్రంలో మహాధర్నా, నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి హాజరయ్యారు. కొడవలూరు, విడవలూరుతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొడవలూరు సెంటర్ వద్ద టీడీపీకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. తొలగించిన ఉద్యోగ, సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దారి పొడవూనా.. వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ.. వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరిచేలా నేతలు కూడా వారిని అనుసరిస్తూ.. నినాదాలు చేసుకుంటూ కదిలారు. సమయానికి ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో గోవర్థన్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి, వీరి చలపతిరావులు అసహనం వ్యక్తం చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైందని.. అందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేషగిరిబాబు, నెల్లూరు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఆల్డా చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, మావులూరు శ్రీనివాసరెడ్డి, ఐదు మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.