అంద‌రూ బాధ్య‌త‌గా తీసుకోవాలి

దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం

ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి

నెల్లూరులో స్వ‌చ్ఛ ఆంధ్ర

స్వ‌చ్ఛ దివ‌స్ ర్యాలీని ప్రారంభించిన ఎంపీ, క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్

ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారని నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణాన్ని ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతను పాటించాలన్నారు. నెల్లూరులో స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ ర్యాలీని ఆయ‌న క‌లెక్ట‌ర్ ఆనంద్‌, క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ల‌తో క‌లిసి ప్రారంభించారు. న‌గ‌రంలోని వీఆర్సీ సెంట‌ర్ నుంచి మ‌ద్రాస్ బ‌స్టాండ్ మీదుగా…గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించి అవ‌గాహ‌న చేప‌ట్టారు. మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ప్రజలందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 722 గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో స్వచ్చాంధ్ర, స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతినెల మూడో శనివారం ప్రత్యేకంగా జరిగే స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక నాయకులు కేతిరెడ్డి వినోద్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *