తిరుమలలో మరో అపశృతి

47వ ల‌డ్డు కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం తిరుమ‌లలో మ‌రో అప‌శృతి చోటు చేసుకుంది. 47వ నెంబ‌ర్ ల‌డ్డూ కౌంట‌ర్‌లోని యూపీఎస్‌లో షార్ట్ స‌ర్క్యూట్ రావ‌డంతో మంట‌లు వ్యాపించాయి. దీంతో కౌంట‌ర్ అంతా పొగ అలుముకుంది. ఈ ఘ‌ట‌న‌తో భ‌క్తులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకురావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. అధికారులు, భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తొక్కిస‌లాట‌…నేడు ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది

Read More

అంద‌రూ బాధ్య‌త‌గా తీసుకోవాలి

దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరులో స్వ‌చ్ఛ ఆంధ్ర స్వ‌చ్ఛ దివ‌స్ ర్యాలీని ప్రారంభించిన ఎంపీ, క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారని నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి తెలిపారు.స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణాన్ని ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతను పాటించాలన్నారు. నెల్లూరులో స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ ర్యాలీని ఆయ‌న క‌లెక్ట‌ర్ ఆనంద్‌,…

Read More

పోలీసులు రారు…చోరీలు ఆగ‌వు

పొంగూరులోని పోలేర‌మ్మ ఆల‌యంలో వ‌రుస‌ చోరీలు భ‌యాందోళ‌న‌లో గ్రామ‌స్థులు నెల్లూరు జిల్లా మ‌ర్రిపాడు మండ‌లం పొంగూరులోని పోలేర‌మ్మ ఆల‌యంలో చోరీ జ‌రిగింది. ఆల‌యంలోని హుండీలో ఉన్న న‌గ‌దును గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఎత్తుకెళ్లారు. గ‌తంలోనూ ఇదే ఆల‌యంలో చోరీ జ‌రిగిన‌ట్లు స్థానికులు తెలిపారు. వ‌రుస చోరీలు జ‌రుగుతున్నా…పోలీసుల‌కు ఫిర్యాదులు చేస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వ‌రుస చోరీలు జ‌రుగుతుండ‌డంతో గ్రామ‌స్థులు భ‌యాందోళ‌న‌కు చెందుతున్నారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి…చోరీల‌ను అరిక‌ట్టాల‌ని గ్రామ‌స్థులు కోరుతున్నారు.

Read More

సంక్షేమ పథకాలన్నీ NTR తెచ్చినవే

పేదల కోసం పాలన చేసిన ముఖ్యమంత్రి NTR. టీడీపీ ఆధ్వర్యంలోముత్తుకూరు లో NTR వర్ధంతి సంక్షేమ పథకాలన్నీ NTR తెచ్చినవే.పేదల కోసం పాలన చేసిన ముఖ్యమంత్రి NTR.టీడీపీ ఆధ్వర్యంలోముత్తుకూరు లో NTR వర్ధంతి కిలో రెండు రూపాయల బియ్యం, పక్కా ఇళ్ళు, పెన్షన్ తదితర సంక్షేమ పడక ప్రవేశపెట్టిన గొప్ప ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో దివంగత…

Read More

మళ్ళీ రైతు బజార్ అస్తవ్యస్తం..

కావలి పట్టణంలో రైతు బజారుకు వచ్చే వినియోగదారులకు తప్పని ఇక్కట్లు పార్కింగ్ స్థలంలో మళ్ళీ యదావిధిగా అమ్మకాలు. రోడ్డు పైకి వాహనాలు నత్త నడకన సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్విన భారీ గుంత పనులు కావలి పట్టణంలో ఎంతో కీలకమైన రైతు బజారు మళ్ళీ అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడకు వచ్చే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చేవారికి పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. వాహనాలను రోడ్డు పైకి నిలుపుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది….

Read More

వైసీపీ మహా ధర్నా

టీడీపీ వేధింపులపై కొడవలూరులో ధ్వజమెత్తిన మాజీ మంత్రులు కాకాణి, ప్రసన్న పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు, నాయ‌కులు, అభిమానులు చంద్రబాబుకి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఏవోల‌ తొల‌గింపు.. ఎస్సీ మ‌హిళా స‌ర్పంచుల‌పై తెలుగుదేశం ప్ర‌భుత్వం చేస్తున్న వేదింపులు ఆపాలంటూ.. కోవూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో… మాజీ డీసీఎంఎస్ ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తిరావు అధ్య‌క్ష‌త‌న.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడ‌వ‌లూరు మండ‌ల కేంద్రంలో మ‌హాధ‌ర్నా, నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న‌ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు….

Read More

తెరుచుకున్న గేట్లు

ఊపిరి పీల్చుకున్న ప్ర‌జ‌లు, దుకాణ‌దారులు అయినా కొన‌సాగుతున్న క‌ర్ఫ్యూ…? గ‌త ఐదు రోజులుగా పోలీసుల ప‌హారాలో ఉన్న‌…ములుముడి బ‌స్టాండ్ సమీపంలోని ఆజాద్ సెంట‌ర్ గేట్లు ఎట్ట‌కేల‌కు గురువారం తెరుచుకున్నాయి. దీంతో ప్ర‌జ‌లు, చిరు వ్యాపార‌స్తులు, రోడ్డ్ మార్జిన వ్యాపార‌స్తులు హ‌మ్మ‌య్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఆ ప్రాంతంలో పోలీసులు బందోబ‌స్తు య‌ధావిధిగానే కొన‌సాగుతోంది. నెల్లూరు న‌గ‌రం ములుముడి బ‌స్టాండ్ స‌మీపంలోని ఆజాద్ సెంట‌ర్‌లో…స్వామి వివేకానంద విగ్ర‌హం ఏర్పాటుతో వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. దీంతో శాంతి…

Read More

ప్రైవేట‌ర్స్ వ‌ల్లే… BSNLకి దెబ్బ‌

బీఎస్ఎన్ఎల్‌ని మ‌రింత ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి నెల్లూరు ఎంపీ, టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం కేవ‌లం ప్రైవేట‌ర్స్ వ‌ల్లే…బీఎస్ఎన్ఎల్ సంస్థ న‌ష్టాల్లోకి వెళ్లిపోయింద‌ని… నెల్లూరు ఎంపీ, టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు న‌గ‌రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో…జీఎంలు, స్టాఫ్ తో… ఆయ‌న టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం నిర్వ‌హించారు. ముందుగా వేమిరెడ్డికి జీఎంలు, సిబ్బంది పూల‌బొకే అంద‌చేసి…

Read More

ఎక్క‌డా క‌నిపించ‌ని ఆర్అండ్‌బీ అధికారులు

ప్ర‌మాద‌కంగా ఎండిన చెట్టుపై ఎందుకు స్ప‌దించ‌డం లేదు సాధార‌ణ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో అధికారుల్ని నిల‌దీసిన‌ నెల్లిపూడి స‌ర్పంచ్ తిరుప‌తి జిల్లా వాకాడు మండ‌లం ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీ శక్తి భవనంలో సాధార‌ణ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ప్ర‌మాద‌క‌రంగా ఎండిన చెట్టు అని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నంపై ఆర్అండ్ బీ అధికారులు ఎందుకు స్ప‌దించ‌డం లేద‌ని…నెల్లిపూడి స‌ర్పంచ్ సూటిగా ప్ర‌శ్నించారు. పచ్చని చెట్లను కొట్టి అమ్ముతున్నారే కానీ… ప్రమాదకరంగా తయారైన ఎండిన చెట్టును… ప్రజలకు ఇబ్బందిక‌రంగా…

Read More

రండి.. చూడండి.. త‌రించండి

మ‌న సంప్ర‌దాయాల‌ను భావిత‌రాల‌కు తెలియ‌జేయండి నెల్లూరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘ‌ట్టాల వివాహ వేడుక‌ల బొమ్మ‌ల కొలువు_ రండి.. చూడండి.. త‌రించండి.. మ‌న సంస్కృతి.. సంప్ర‌దాయాల‌ను భ‌విత‌రాల‌కు తెలియ‌జేండి.. అంటూ.. నెల్లూరు మినీబైపాస్‌.. అన్న‌మ‌య్య స‌ర్కిల్ వ‌ద్ద‌నున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘ‌ట్టాల వివాహ వేడుక‌ల బొమ్మ‌ల కొలువు ఏర్పాటు చేశారు. మ‌న ఆచారాలు.. సంప్ర‌ద‌యాలల్లో వ‌చ్చ మార్పులు, చేర్పులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. మ‌న హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గాల్సిన 21 ఘ‌ట్టాల‌ను రాబోయే…

Read More