ప్రభుత్వ నిధులు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా లేదా..?

కోవూరులో త‌నిఖీలుచేసిన మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ విజయబారతి

నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం.. కోవూరు మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల క‌మిష‌న్ స‌భ్యురాలు విజయభారతి ఆకస్మిక తనికీలు చేశారు. అక్క‌డి సిబ్బందితో మాట్లాడారు. కొన్ని ఫైల్స్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులు క‌ల్పించింద‌ని.. వీటిలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా .. లేదా.. గ్రామాలలో విద్యా, వైద్యం, విద్యుత్, పారిశుధ్యం పై పంచాయతీల పనితీరుతోపాటు పలు అంశాలపై సంబంధిత అధికారులను ముఖా ముఖి చర్చించి.. అడిగి తెలుసుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలం తహసిల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి రెడ్డి, పీహెచ్‌సీ వైదులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *