డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం
మైనార్టీ నేత కరీముల్లాకి అవకాశం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నైతిక విలువలకి , మోసానికి మధ్య పోటీ జరుగుతుందని…మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీపై…ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో…ఎమ్మెల్సీ, నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా డిప్యూటీ మేయర్గా 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా పోటీ చేస్తున్నారని అధికారికంగా ప్రకటించి..భీపారం పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ… డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. కొందరు పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారని ధ్వజమెత్తారు. వైసీపీలో గెలిచిన కార్పొరేటర్ కి డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.