నెల్లూరులో రూ. 6 కోట్లు ప్ర‌ద‌ర్శ‌న‌…

సిల్వ‌ర్ వోక్స్ స్కూల్లో…పురాత‌న‌, స‌మ‌కాలిన నాణేలు ప్ర‌ద‌ర్శ‌న‌

ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌

పురాత‌న నాణేల‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తోన్న విద్యార్థులు

నెల్లూరు నగరంలోని సిల్వర్ వోక్స్ పాఠశాల యాజ‌మాన్యం….జాతీయ నాణేల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న నాణేల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్రమాన్ని ప్రారంభించారు. ముందుగా క‌లెక్ట‌ర్‌కు స్కూల్ యాజ‌మాన్యం, విద్యార్థులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో సుమారు రూ. 6 కోట్లు విలువ చేసే పురాత‌న‌, స‌మ‌కాలిన నాణేల‌ను ఉంచారు. ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించి ఇంత మంచి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన సిల్వ‌ర్ వోక్స్ యాజ‌మాన్యాన్ని ప్ర‌త్యేకంగా అభినందించారు. ప‌లు స్కూళ్ల విద్యార్థులు ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. సమాజంలో తొలినాళ్లలో నగదును నాణేల‌ రూపంలో ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ కాలంలో నాణేల‌ను తయారు చేయడం… వాటిమీద బొమ్మలు ముద్రించడం చాలా గొప్ప విషయమన్నారు. పిల్లలు నగదు మార్పిడి తదితర విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ జాతీయ నాణేల‌ ప్రదర్శన ఎంతో అద్భుతమని కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు. అనంత‌రం ప్రైవేట్ పాఠ‌శాల‌ల అధ్య‌క్షుడు నేల‌నూత‌ల శ్రీ‌ధ‌ర్‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్ నెల్లూరుజిల్లా ప్రాంతీయ ప‌ర్య‌వేక్ష‌ణాధికారి ఆదూరు శ్రీ‌నివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిల్వర్ వోక్స్ స్కూల్ యాజ‌మాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *