15 రోజులే ఇబ్బందులు సహకరించాలి

నిత్యం రద్దీగా ఉండే బ్రిడ్జిపై రాకపోకలకు ఇబ్బందులు

కావలి పట్టణంలోని ఫ్లైఓవర్ పై మరమ్మత్తులు

ఫ్లై ఓవర్ వంతెన ప్రమాదానికి గురికాకుండా తీసుకుంటున్న చర్యలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విజ్ఞప్తి

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఫ్లై ఓవర్ వంతెన ఒకవైపు ఉదయగిరి, కడపకు, మరోవైపు కావలి పట్టణంలోకి, విజయవాడ, చెన్నై వెళ్లేందుకు ఎంతో కీలకం ఉంది. ప్రధాన వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలకు ఈ వంతెనే దిక్కు. ప్రస్తుతం వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో వాహన రాకపోకలను వేరే ప్రాంతాల నుంచి పట్టణంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. కొత్తగా వచ్చేవారు ఎటువైపు వెళ్ళాలో అర్థం కాక సతమత
మవుతున్నారు. కడప వైపు వెళ్ళు భారీ వాహనాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 30 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వంతెన పై జాయింట్ల వద్ద గతుకులు ఏర్పడి రాకపోకల సమయంలో నానా అవస్థలు పడుతున్నారు. భారీ వాహనాలు వెళుతున్నప్పుడు వంతెన జంపింగ్ ఇస్తుంది. దీంతో నేషనల్ హైవే వారు మరమ్మత్తులు చేపట్టారు. ప్రజల ఇబ్బందులను గమనించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించారు. 15 రోజులు మాత్రమే ఇబ్బందులు ఉంటాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని N3 న్యూస్ న్యూస్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *