సింహ‌పురిలో వేడెక్కిన రాజ‌కీయం@

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పై ఎత్తుల‌కు పై ఎత్తులు

నువ్వా…నేనా అంటున్న‌ అధికార‌, ప్ర‌తిప‌క్షం

జిల్లాలో డిప్యూటీ మేయ‌ర్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌పై N3 డెస్క్ రిపోర్ట్…

సింహపురి సీమలో ఒక్క సారి రాజకీయం వేడెక్కింది.. జిల్లాలో డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్ ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో కూటమి, వైసిపి పార్టీల నేతలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు.. ఓవైపు తమకే బలం ఉందని కూటమి పార్టీ నేతలు చెబుతుంటే… తమ పార్టీకే పదవి వరిస్తుందని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లకుగాను దాదాపు 40 మంది వరకు అధికార టిడిపి వైపు ఉంటే..14మంది కార్పొరేటర్లు వైసీపీ వైపు ఉన్నారు..ఇక బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతిలో 20 వార్డులకు గాను 12మంది కౌన్సిలర్ల సంఖ్యాబలంతో అధికార టీడీపీకు వుండగా వైసీపీకు 8మంది ఉన్నారు.. అయితే బుచ్చిరెడ్డిపాళెం రాజకీయ పరిణామాలు గంటగంటకు మారుతున్నాయి.. దీంతో నెల్లూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీనిపై…ఎన్‌3న్యూస్ ప్ర‌తినిధి మ‌హిద్ డెస్క్ రిపోర్ట్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *