యువత అభివృద్ధిపై అవగాహన సదస్సు

ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ జాతీయ అధ్యక్షులు డేగ

నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ యునైటెడ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు వేగూరు విజయకుమార్ యువతకు అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువత చెడు మార్గాల్లో వెళ్లడం ద్వారా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. యువత బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. యువత భారతదేశానికి తొలి మెట్టు అని, యువత అభివృద్ధి వైపు నడవాలని, మంచి వైపు ఉండాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు పట్టణ, గ్రామాల్లో నిర్వహిస్తామని యువతకు ఆదర్శంగా మా ఆలిండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫారం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ, మణికుమార్, ప్రసాద్, పాండు, దిలీప్, లోకేష్, అదే షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *