చెత్త సంప‌ద కేంద్రాల‌ను అభివృద్ధి ప‌రుస్తాం

ఈవోపీఆర్డీ భార్గ‌వి

సీతారామ‌పురంలో చెత్త సంప‌ద కేంద్రాన్ని ప‌రిశీలించిన ఈవోపీఆర్డీ

మండలంలోని అన్ని చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధిపరచి వర్మీకంపోస్టు తయారీ ప్రారంభించడం జరుగుతుందని ఈవోపిఆర్డి భార్గవి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం గ్రామ సచివాలయం1 పరిధిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఈవోపిఆర్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ద్వారా ఎరువులు తయారు చేస్తే, సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాల్లో ఇంటింటా ఉత్పత్తయ్యే చెత్తను ఎరువుగా మార్చి పంచాయితీలకు ఆదాయాన్ని అందించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే తప్పని సరిగా పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యత తీసుకోని వర్మీకంపోస్ట్ తయారీకి సహకరించాలని సూచించారు. ఇప్పటికే అయ్యావారిపల్లి, బసినేనిపల్లి, సీతారామపురం,మారంరెడ్డిపల్లి గ్రామాల్లో సంపద కేంద్రాలలో వర్మీకంపోస్ట్ తయారీ ప్రారంభించి సంపదకేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *