కావలిలో జబర్దస్త్ శాంతి స్వరూప్ సందడి

పేదలతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం

కావలి ఎమ్మెల్యే చొరవతో కట్టుదిట్టంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ అంటూ కితాబు

శాంతి స్వరూప్ ను సన్మానించిన కావలి సీఐలు

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జబర్దస్త్ శాంతి స్వరూప్ సందడి చేశారు. కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు ను కలిసేందుకు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడే కావలి ఒన్ టౌన్, టుటౌన్ సీఐలు ఉండడంతో అందరూ జబర్దస్త్ శాంతి స్వరూప్ తో కొద్ది సమయం ముచ్చటించారు. అనంతరం జబర్దస్త్ లో కి ఎంట్రీ ఎలా జరిగింది, తదితర విషయాలు చర్చించారు. ముగ్గురు సీఐలు కలిసి శాంతి స్వరూప్ ను సన్మానించారు. అనంతరం అన్నా క్యాంటీన్ కు వెళ్లిన శాంతి స్వరూప్ క్యూలో వెళ్ళి టోకన్ తీసుకుని భోజనం చేసారు. ఎప్పటి నుంచో అన్నా క్యాంటీన్ లో పేదలతో కలిసి భోజనం చేయాలనే కోరిక ఉండేదని, అది ఈ రోజుతో తీరిందన్నారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి, కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన అన్నా క్యాంటీన్ లు ఎంతో ఉపయోగంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవతో కావలి అన్నా క్యాంటీన్ ఎంతో కట్టుదిట్టంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *