ముందుకు వస్తే మూడుద్ది

బుచ్చి వ్యాపారస్తులకు కమిషనర్, సీఐ హెచ్చరికలు

నిబంధనలు పాటించాలన్న కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నా సీఐ శ్రీ‌నివాసులురెడ్డి

బుచ్చి మున్సిపల్‌ పరిధిలోని, వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నగర పంచాయతిలోని ప్రధాన రహదారిని మంగళవారం సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలిసి కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు పలు సూచనలు చేశారు..నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు, వాహన దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, రోడ్లపై ముందుకు ఎట్టి పరిస్థితుల్లో కూరగాయలను అమ్మకూడదన్నారు. వ్యాపారస్తులకు ఎంత అయితే కేటాయించిన స్థలాలు ఉన్నాయో వాటిలో మాత్రమే ఉపయోగించుకోవాలని రోడ్లను ఆక్రమించి వాహనదారులకు సామాన్యులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. పట్టణంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్నారనీ, రోడ్డునకు ఇరువైపులా వ్యాపారస్తులకు అవగాహన కల్పించామని సీఐ తెలిపారు..పలుమార్లు చెప్పినప్పటికి కొంతమంది వ్యాపారస్తులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *