గుడ్ మార్నింగ్ వ‌ద్దు – శుభోద‌యం ముద్దు

. మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు

. స్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్ట్ లో విద్యార్థుల‌తో ముఖాముఖి

గుడ్ మార్నింగ్ వద్దు… శుభోదయం ముద్దు… సినిమాలు వినోదం కోసమే సినిమాలను అనుసరించవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో వివిధ వృత్తి కోర్స్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఎన్ సి సి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంత‌రం వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణ, సమయ పాలన, ఇష్టపడి కష్ట‌పడి పని చేస్తే నష్టం ఉండదని సూచించారు. తెలుగులోనే మాట్లాడుదాం అని విద్యార్థులకు సూచించారు. నేను అధిరోహించిన పదవుల్లో కన్నా… నాకు స్వర్ణభారత్ ట్రస్ట్ లో విద్యార్థులను, వృత్తి కోర్స్ నేర్చుకుంటున్న మిమ్మల్ని చుస్తే నాకు సంతృప్తినిస్తుందన్నారు. ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. తనకి పదహారేళ్లలోనే తల్లిని కోల్పోయినా… ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా విద్యలో రాణించి ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్ర‌స్టీ స‌భ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *