గుండె వ్యాధి రోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌

రూ.42వేల విలువ ఇంజ‌క్ష‌న్ ఉచితంగా పంపిణీ

. ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో అందుబాటులో

ఇందుకూరుపేట మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ సునీల్ వెల్ల‌డి

గుండె సంబంధిత వ్యాధి రోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింద‌ని…ఇందుకూరుపేట మెడిక‌ల్ ఆఫీస‌ర్ సునీల్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న స్థానిక సీహెచ్‌సీ లో మీడియాతో మాట్లాడారు. మండ‌లంలోని ఆరోగ్య కేంద్రంలో ఛాతినొప్పికి సంబంధించిన రూ. 42వేలు ఖ‌రీదైన ఇంజ‌క్ష‌న్‌ను అందుబాటులో ఉంద‌ని చెప్పారు. ఈ ఇంజ‌క్ష‌న్ ను ఉచితంగా గుండె సంబంధించిన రోగుల‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గుండె నొప్పి వచ్చిన గంట వ్యవధిలో ఈ ఇంజక్షన్ వేయడం వలన ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించడం ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *