మ‌మ్మ‌ల్ని ఎవ‌డ్రా ఆపేది..

మ‌మ్మ‌ల్ని ఎవ‌డ్రా ఆపేది..

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా గూడూరులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది..రోజురోజుకు వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.. పట్టణ సమీపంలోని గాంధీనగర్ శివారు ప్రాంతాల నుండి రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ ను తరలిస్తున్నారు… స్థానికంగా గ్రావెల్ కు మంచి డిమాండ్ ఏర్పడడంతో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు భారీ యంత్రాలను ఉపయోగించి టిప్పర్ల ద్వారా గ్రావెల్ ను తరలించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు…ఏకంగా టిడ్కో గృహాల సముదాయానికి సమీపంలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు…దీంతో టిడ్కో గృహాల స‌మీపంలో భారీ గుంత‌లు ఏర్ప‌డడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… భారీ ఎత్తున గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్న కూడా మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడంపై అనేక విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి గ్రావెల్ మాఫియాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *