ఆరు లీటర్ల నాటు సారా, ఒక బైక్ స్వాధీనం
మీడియా సమావేశంలో అశ్వరరావుపేట ఎక్సైజ్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని అశ్వరరావుపేటలో….నాటు సారా విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని…వారి వద్ద నుంచి ఆరు లీటర్ల నాటు సారా, ఒక మోటారు బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిపై వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అశ్వరరావుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.