కోవూరులో దొంగలు హల్ఛల్ -సవాల్ విసురుతున్న దొంగలు
ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చోరీలు -ఏకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంట్లోనే పడ్డారు
కోవూరు మండల పరిధిలో దోపిడీదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గడచిన మూడు నెలల్లో ఒక్క కోవూరు పట్టణానికి సంబంధించిన పలు కాలనీల్లో ఎవ్వరు లేని ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఇలా.. ఆరు కు పైగా ఇళ్లలో దోపిడీకి పాల్పడి దొరికినంతా దోచుకుపోయారు .శనివారం కూడా .. అదేవిధంగా కోవూరు పట్టణంలోని రామాలయం వద్ద దావనం వారి వీధిలో గాదిరాజు రాంప్రసాద్ ఎక్సయిజ్ కానిస్టేబుల్ ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలోని రెండు కేజీల వెండి ,సుమారు ఇరవై వేలు నగదు, పలు వస్తువులు దోచుకెళ్లి.. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.. అంటూ పోలీసులను వెక్కిరిస్తున్నట్లుంది చోరుల పరిస్థితి.