కావలి మండలంలో సాగునీటి ఎన్నికలు ప్రశాంతం.
20 చెరువులకు సాగునీటి సంఘాల ఎన్నికలు.
నోడల్ అధికారులు తహశీల్దారు శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఏఈ కిరణ్ ల ఆధ్వర్యంలో ఎన్నికలు
కావలి మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 చెరువులకు ఎన్నికలు నిర్వహించగా అన్నీ ఏకగ్రీవాలే అయ్యాయి. ఎన్నికైన టీ. సి. సభ్యుల్లో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను మండలంలో నోడల్ అధికారులుగా తహశీల్దారు శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఏఈ కిరణ్ లు నిర్వహించారు. మండలంలో అన్నీ సంఘాలలో ఎన్నికల తీరును పర్యవేక్షించారు. మండలంలో ఎన్నికైన చైర్మన్లు అడవి లక్ష్మీపురం – బూచి శివయ్య, రుద్రకోట- చల్లా రవి,
ముసునూరు మందాడి చెరువు- అమర్నాథ్ రెడ్డి.. అలాగే.. కావలి పెద్ద చెరువు – ఉప్పాల వెంకయ్య, తాళ్లపాలెం -నారీ సుందర్ రావు, నారాయణ పురం -కమతం గోవర్ధన్ రావు, కొత్తపల్లి – పాటిబండ్ల వెంకటేశ్వర్లు, ఆర్. సి.పాలెం – పొంకు తాతయ్య, చలంచర్ల -చేజర్ల వెంకటేశ్వరరావు,
కావలి పాపిరెడ్డి చెరువు -కృష్ణారెడ్డి, తుమ్మలపెంట -పులి సుధాకర్ రావు, మద్దురుపాడు – వెంకట్రావు,
సిరిపురం -కొత్తపల్లి పెంచల ప్రసాద్, గౌరవరం పెద్ద చెరువు- రఘురామయ్య, గౌరవరం కొత్తచెరువు- తుళ్లూరు కృష్ణయ్య, మున్నంగిదిన్నె – ఉప్పాల తిరుపతి, ఆనెమడుగు -బి శ్రీనివాస్ రెడ్డి,
ముసునూరు- ఉప్పు వెంకటస్వామి, బుడంగుంట – రామిరెడ్డి, చన్నాయపాలెం -మర్రి శివాజీలు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు దృవీకరణ పత్రాలు అందజేశారు. ఎన్నికైన చైర్మన్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కూడా వారందరికీ శుభాకాక్షంలు తెలియజేశారు.