స్మగ్లర్లకు అగ్రి “గోల్డ్”

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ జామాయిల్ కర్ర స్మగ్లింగ్

స్వయంగా పరిశీలించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సీపీఐ

పరిశీలనకు వస్తున్నట్లు తెలుసుకుని నరికేసిన కర్రను ఎక్కడకు అక్కడే వదిలేసి వెళ్లిన స్మగ్లర్లు

సుమారు 50 ఎకరాల్లో 15 సంవత్సరాలనాటి జమాయిల్ కర్ర తరలించినట్లు గుర్తింపు

స్మగ్లర్లకు అగ్రి “గోల్డ్”

  • నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ జామాయిల్ కర్ర స్మగ్లింగ్
  • స్వయంగా పరిశీలించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సీపీఐ
  • పరిశీలనకు వస్తున్నట్లు తెలుసుకుని నరికేసిన కర్రను ఎక్కడకు అక్కడే వదిలేసి వెళ్లిన స్మగ్లర్లు
  • సుమారు 50 ఎకరాల్లో 15 సంవత్సరాలనాటి జమాయిల్ కర్ర తరలించినట్లు గుర్తింపు

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ భూముల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అక్కడ జామాయిల్ కర్రను స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుసుకున్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సీపీఐ నాయకులు బుధవారం పరిశీలించారు. వీరు వస్తున్నట్లు తెలుసుకున్న స్మగ్లర్లు అక్కడి నుంచి బిషాణం ఎత్తేశారు. కర్రను తాటతీసే యంత్రాలను, లారీలను అక్కడి నుంచి తరలించేశారు. నరికేసిన జామాయిల్ కర్రను ఎక్కడకు అక్కడే వదిలేసి వెళ్లాను. అదేవిధంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన జామాయిల్ కర్ర భారీ డంప్ లు అక్కడ దర్శనమిచ్చాయి. సుమారు 50 ఎకరాల్లో ఇప్పటికే కొట్టి తరలించేసినట్లు వారు భావించారు. అక్కడ తీరును చూసి అసలు ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారా… అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం మండల తహశీల్దారును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చిందని, ఆ భూములు సీఐడీ అటాచ్ లో ఉన్నాయని తామేమీ చేయలేమని చెప్పడంతో వారంతా విస్తుపోయారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య, అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ శంకరయ్య ఉపాధ్యక్షుడు పి కృష్ణయ్య కార్యదర్శి గడ్డం మాల్యాద్రి సభ్యులు శ్రీ రంగయ్య, సురేష్, రాధాకృష్ణ, శివరామయ్యలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *