అగ్రిగోల్డ్ భూముల్లో యదేచ్ఛగా జామాయిల్ స్మగ్లింగ్
300 మంది కూలీలు, పదుల సంఖ్యలో లారీలు, తాటతీసే యంత్రాలు మోహరింపు
పుష్పాకి వ్యవస్థలన్నీ జూహుజూర్ – టిడిపి రాష్ట్రనేత అడ్డుకునేందుకు వెళ్లగా దాడికి యత్నం
వరికుంటపాడు మండలంలో పుష్ప-3 సినిమా షూటింగ్ జరుగుతుంది. గత వారం రోజులుగా వందల మంది కూలీలు, పదుల సంఖ్యలో లారీలు, యంత్రాలు మోహరించి కలప తరలిస్తున్నారు. మీడియాల్లో ఎన్ని కథనాలు వచ్చినా తగ్గేదేలా అంటూ రెచ్చిపోతున్నారు. అసలు పుష్పా, పుష్ప 2 సినిమాలు చూసాం.. పుష్ప 3 ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనుకుంటున్నారా.. తెలుసు కోవాలంటే వరికుంటపాడు మండలం కనియంపాడు వెళ్లాల్సిందే. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కోవాలంటే N3 చూడాల్సిందే..
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం కనియంపాడులో వేల సంఖ్యలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా పెంచిన జానాయిల్, ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఈ భూములు ఎందరో అగ్రిగోల్డ్ బాదితుల ఆస్తి అని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కానీ గత వారం రోజులుగా ఇక్కడ వందల సంఖ్యలో కూలీలు మోహరించి పదుల సంఖ్యలో యంత్రాలు, లారీలతో తరలిస్తున్నారు. ఇక్కడ కలప తరలింపుకు బహిరంగంగా వేలంవంటిది ఏమి జరగలేదని ఆ ప్రాంత గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇంత పెద్ద యెత్తున ఇక్కడ జామాయిల్ కర్ర తరలిస్తుంటే వ్యవస్థలన్నీ జూహూజూర్ అంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ దోపిడీ జరుగుతుందని టీడీపి రాష్ట్ర నేత అక్కడకు వెళితే దాడి చేసేందుకు వెనుకాడలేదని తెలిసింది. అక్కడ జరుగుతున్న జమాయిల్ తరలింపు వీడియోలు రహస్యంగా చిత్రీకరించే పరిస్థితి ఉందంటే మనం ఎలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నామనే ఆలోచన రాకమానదు. ఇక్కడి స్మగ్లింగ్ వ్యవహారం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది. స్థానిక మండల తహశీల్దారు, ఎస్సై, జిల్లా ఎస్పీకి పిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది.