మనీ స్కాం ఆఫీస్ లో సోదాలు

. కావలి పట్టణం ముసునూరులోని షేర్ మార్కెట్ మనీ స్కాం కార్యాలయంలో తనిఖీలు

. కార్యాలయం గేటు, ఆఫీసు, తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించిన అధికారులు

. పక్కనే మనీ స్కాం సూత్రధారి మహబూబ్ సుబాన్ ఇంటిలోనూ తనిఖీలు

. కావలి డిఎస్పీ శ్రీధర్, కావలి తహశీల్దారు ఆధ్వర్యంలో సీఐలు, సిబ్బంది సోదాలు

నెల్లూరు జిల్లా కావలిలో షేర్ మార్కెట్ మనీ స్కాంపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. మంగళవారం కావలి పట్టణం ముసునూరులోని షేర్ మార్కెట్ మనీ స్కాం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కావలి డిఎస్పీ శ్రీధర్, కావలి తహశీల్దారు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, సిబ్బంది మంగళవారం కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన గేటు, ఆఫీసు తాళాలు వేసి ఉండడంతో వాటిని పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న మనీ స్కాం సూత్రధారి మహబూబ్ సుబాన్ ఇంటిలోనూ తనిఖీలు చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రాంతం పోలీసుల మయం అయిపోయింది. కార్యాలయంలో రికార్డులను, కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మీడియాను లోపలకు రానీయ‌కుండా పోలీసులు దూరంగా ఉంచారు. షేర్ మార్కెట్ పేరుతో వసూలు చేసిన డబ్బులు వివరాలు, ఎంతెంత కట్టారో , షేర్ మార్కెట్ లావాదేవీలు తెలుసుకునేందుకు కార్యాలయంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. తనిఖీల వివరాలు అధికారులు అధికారికంగా వెళ్లడించాల్సింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *