ఫైనల్ విజేతకు రూ.1లక్ష ప్రైజ్ మనీ

కావలిలో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు నగదు బహుమతులు

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా విన్నర్ జట్టుకు ఒక లక్ష, రన్నర్ జట్టుకు 50 వేలు అందజేత

ఎన్ని ఇబ్బందులు వచ్చిన టోర్నమెంట్ నిర్వహించిన సిద్ధుకు ఎమ్మెల్యే అభినందనలు

కావలిలో కేసీఏ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేత జట్లుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. విన్నర్ జట్టు లెవన్ బుల్స్ కు రూ ఒక లక్ష, రన్నర్ జట్టు సుభాష్ చంద్రబోస్ లెవన్ జట్టుకు రూ.50 వేలు, మూడో విజేత ఉదయ్ ప్రెండ్స్ లెవన్ జట్టుకు రూ.25 వేలు నగదు బహుమతులు అందజేసి వారిని ప్రశంసించారు. 64 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ ను ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన సిద్దు స్పోర్ట్స్ ఐకాన్ లీడర్ గా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సిద్దుకు సహకరించిన కేసీఏ బృందానికి అభినందనలు తెలిపారు. ఇక నుంచి ఒక్క క్రికెట్ మాత్రమే కాకుండా మిగిలిన అన్నీ గేమ్స్, స్పోర్ట్స్ కావలి స్పోర్ట్స్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అందరు ముందుకు రావడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దు, బుర్లా శ్రీధర్ రెడ్డి, దేవర కొండ శ్రీను, కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ కెసిఆర్ కోచ్ రాజశేఖర్ మద్దులపాడు శ్రీను , అంజన్ ఖాన్ , సురేష్ , సుబ్బరామిరెడ్డి, టీడీపి నాయకులు మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *