ఆర్అండ్బీ జంగిల్ క్లియరెన్స్ పనుల్లో భారీగా అవకతవకలు
ఫోటోలకే పరిమితమైన పనులు
భయాందోళన వ్యక్తం చేస్తోన్న పామంజి గ్రామస్థులు
తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలిమేడు పంచాయతీ పరిధిలోని పామంజి గ్రామంలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు…మూడు ఫోటోలు…ఆరు పొదలకే పరిమితమైపోయాయన్న చందనా తయారయ్యాయి. గత రెండు రోజుల క్రితమే సంబంధిత అధికారులు వచ్చి హడావుడి చేసి…జంగిల్ పనులు చేశామంటూ… ఫోటోలు తీసుకెళ్లారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చుట్టపు చూపుగా ఓ జేసీబీని తీసుకొచ్చి…ఆ పొదలు… ఈ పొదలు అలా నెట్టేసి వెళ్లిపోయారని వాపోయారు. ఈ పనుల్లో భారీగానే అవకతవకలు జరిగాయని, సంబంధిత అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీని కారణంగా…పెద్ద పెద్ద చెట్ల పొదలు ఉండిపోవడంతో వాటిలో పెద్ద పెద్ద పాములు…విష పురుగులు తమ ఇళ్లలోకి వస్తున్నాయని…రాత్రి అయితే చాలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాన్ని పట్టించుకొని… ఈ పొదలను తొలగించాలని గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఎన్3 న్యూస్ ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తమ ప్రతినిధి అక్కడకు వెళ్లి స్థానికుల్ని పలకరించారు. అసలేం జరిగిందో వారి మాటల్లోనే విందాం….