కావలిలో శ్రీ వింద్ర యూలర్ మోటార్స్ షోర్ రూం ప్రారంభం

ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

యూలర్ ఎలక్ట్రిక్ ఫోర్, త్రీ వీలర్ ఆటోలను కావలి ప్రాంతానికి తీసుకురావడంపై ఎమ్మెల్యే హర్షం

షోర్ రూం అధినేతలు టీడీపి నేత గాదంశెట్టి వేణు తనయులు చరణ్, సందీప్ లకు ఎమ్మెల్యే అభినందనలు

పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలకు దేశ వ్యాప్తంగా శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని ఆటోనగర్ వద్ద టీడీపి నేత గాదంశెట్టి వేణు తనయులు చరణ్, సందీప్ ల యూలర్ ఎలక్ట్రిక్ మోటార్స్ నూతన షోరూంను ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. కావలి వంటి ప్రాంతానికి యూలర్ ఎలక్ట్రిక్ ఫోర్, త్రీ వీలర్ ఆటోలను తీసుకురావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. వారి వ్యాపారం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం యజమానులు గాదంశెట్టి వేణు, చరణ్, సందీప్, టీడీపి నాయకులు గుత్తికొండ కిషోర్, పోతుగంటి అలేఖ్య, రాజ్ కుమార్ చౌదరి, బుర్ల శ్రీధర్ రెడ్డి, శానం హరి, వైద్యులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *