గత ఎన్నికల్లో పార్టీ సింబల్ మీదనే 54 గెలిచాం – మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కార్యాలయంలో కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో కీలక భేటీ
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోస్ట్ కు సంబంధించి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో… వైసీపీ కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో కాకాణి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డిలు కీలక భేటీ అయ్యారు. ముందుగా వారందరితో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్టీ సింబల్ మీద గెలుపొందారున్నారు. కనీసం ఒక సీటు కూడా గెలవలేని తెలుగుదేశం పార్టీ నేడు నైతిక విలువలకు నిలువునా పాతర వేసి అనేక ప్రలోభాలతో టిడిపి వైపు కార్పొరేటర్ లను లాక్కుందన్నారు. వైసీపీ నుంచి గెలుపొంది నేడు టిడిపికి మద్దతు పలుకుతున్న వారు ఆ పార్టీకి ఓటు వేస్తే వెంటనే తాము న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ కు పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు.