ఎస్ఐ, సీఐలు స్పందించ‌కుంటే…డీఎస్పీని క‌ల‌వండి

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం 1989పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐడి డిఎస్పి కోటారెడ్డి పాల్గొని అవగాహనా నిర్వహించారు. ప్రతి ఒక్కరు చట్టల పై అవగాహనా కల్గి ఉంటే ఇబ్బందులు ఉండవని అన్నారు. కేసుల విషయంలో ఎస్ఐ, సీఐ స్పందించకుంటే నేరుగా డీఎస్పీని కలసి సమస్యలు పరిష్కారించుకోవ‌చ్చ‌ని తెలిపారు. కులమాతలకు అతీతంగా అందరు సమానమని ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు…

Read More

వ్య‌వ‌సాయ రంగాభివృద్ధికి సిడ్బి కృషి చేయాలి

విభజిత నెల్లూరు జిల్లా జిడిపి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నందున, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి సిడ్బి కృషి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. నెల్లూరు నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. క‌లెక్ట‌ర్…

Read More

సీహెచ్ సీ డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్ర‌హం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమెకు బుచ్చిరెడ్డి పాళెం నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి స్థానిక నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. మండల సర్వ సభ్య సమావేశంలో ముందుగా విద్యాశాఖకు సమందించిన పురోగతిని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన…

Read More

స‌ర్వేప‌ల్లిని రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతా…

నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్‌ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు హాజరై గిరిజనుల నుంచి…

Read More

రాపూరులో కెమిక‌ల్ బ్లాస్టింగ్‌

వేస్ట్ మేనేజ్ మెంట్ ప్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌… ఉమ్మ‌డి నెల్లూరు రాపూరు మండ‌లంలో చోటు చేసుకుంది. రావిగుంట‌ప‌ల్లిలోని వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్యాక్ట‌రీలో…కెమిక‌ల్ బ్లాస్టింగ్ జ‌ర‌గ‌డంతో… ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తోపాటు…పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. డంపింగ్ యార్డులో ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వాహ‌నాల్లో నుంచి డ్రైవ‌ర్లు దూసుకేసిన‌ట్లు స‌మాచారం. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని… మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినా మంట‌లు…

Read More

త‌న్నుకున్న తెలుగు త‌మ్ముళ్లు

ఓ స్థ‌ల వివాదంలో…మాజీ కార్పొరేట‌ర్‌, ప్ర‌స్తుత కార్పొరేట‌ర్ వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలో చోటు చేసుకుంది. ఈ దాడుల్లో… 53,54 క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జి జ‌హీర్ త‌ల‌కు తీవ్ర గాయాల‌వ‌డంతోపాటు…ఇరువ‌ర్గాల వారికి ర‌క్త‌పు గాయాల‌య్యాయి. దీంతో జ‌హీర్ ని ఆయ‌న అనుచ‌రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్‌కి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి అపోలోకు త‌ర‌లించారు. అలాగే ఈ దాడుల్లో ముజీర్ వ‌ర్గం అనుచ‌రులు కూడా గాయ‌ప‌డ్డారు. వారు…

Read More

ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉదయగిరి జిల్లా ఉద్యమ గర్జన…!

హైస్కూల్ నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు భారీ ర్యాలీ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి జిల్లా సాధనే లక్ష్యంగా ఉదయగిరిలో ఉధృతం చేశారు. జిల్లా సాధన సమితి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, షేక్ దస్తగిరి అహ్మద్ సారథ్యంలో ఉదయగిరిలో హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు భారీ జన సందోహం మధ్య జానపద కళాకారుల డప్పులతో ర్యాలీగా నిర్వ‌హించారు. అనంతరం బ‌స్టాండ్ వ‌ద్ద‌ మానవహారం చేప‌ట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… ఏళ్ల తరబడి వివక్షకు…

Read More

ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జిలో డ్రైనేజీ నీళ్లు

నెల్లూరు న‌గ‌రం ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద‌…భారీగా డ్రైనేజీ నీళ్లు చేరాయి. దీంతో అటుగా ప్ర‌యాణించే వాహ‌న‌దారులు, పాద‌చారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీళ్లు కావ‌డంతో భ‌య‌క‌రంగా దుర్వాస‌న వెద‌జ‌ల్లుతోంది. అటు వెళ్ల‌లేక ప్ర‌జ‌లు నర‌క‌యాత‌న ప‌డుతున్నారు. సాధార‌ణంగా చిన్న‌పాటి వ‌ర్షం కురిస్తేనే అండ‌ర్ బ్రిడ్జి స‌ముద్రాన్ని త‌ల‌పిస్తోంది. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా… సంబంధిత కార్పొరేష‌న్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాహ‌న‌దారులు వాపోతున్నారు. వెంట‌నే కార్పొరేష‌న్ అధికారులు స్పందించి…అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద నిల్వ ఉన్న…

Read More

వింజ‌మూరులో పశుగణన సర్వే ప్రారంభం

ప‌శువుల సంఖ్య‌, రైతువారి డేటా సేక‌ర‌ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు 21 వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభించినట్లు వింజమూరు ఏరియా పశువైద్యాధికారి డాక్టర్. రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. మండలంలోని ఉండే పశువులు సంఖ్యను, రైతువారి డేటా సమీకరించి ప్రతి గ్రామంలో ఎన్ని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సర్వే వలన నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి కులాలు వారీగా కేంద్ర, రాష్ట్ర…

Read More

అగ్ని ప్ర‌మాద‌మా..? ఆక‌తాయిల ప‌నా…?

నెల్లూరు న‌గ‌రంలోని డీఎంహెచ్‌వో కార్యాల‌య ప్రాంగ‌ణంలో…అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దోమల మందు, దోమలకు కాలువల్లో వేసే మడ్డి ఆయిల్ నిలువ ఉంచే పాత‌ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జ‌రిగింది. దీంతో భ‌వ‌నంలో నుంచి ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తో పాటు….మ‌డ్డి ఆయిల్ ఉండ‌డంతో పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. డీఎంహెచ్‌వో కార్యాల‌యంలో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జ‌లు ఒక్క సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి…

Read More