సంక్షేమ ప‌థ‌కాల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాలి

రాష్ట్రంలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేసేందుకు తగినన్ని నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. జిల్లా కమిటీ పిలుపులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం కమిటీ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అంద‌చేశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ… హామీలు ఇంత వరకు అమలు కాలేదని ఈ బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి సంక్షేమ…

Read More

జ్వాలాముఖి స‌న్నిధిలో పీఠాధిప‌తి రామానంద భార‌తిస్వామి

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శక్తి మాత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామానంద భారతి స్వామి దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు అర్చక బృందం ఆధ్వర్యంలో భార‌తి స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భారతీస్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారు మీడియాతో మాట్లాడారు… హిందూ ధర్మాన్ని…

Read More

బెల్టు పెడితే క్రిమిన‌ల్ కేసే

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో అక్రమంగా ఓ వ్యక్తి మద్యం అవుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి రాత్రి దాడులు నిర్వహించారు .ఈ దాడుల్లో పాశం కృష్ణయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు లైసెన్స్ కలిగిన షాపు దారులు మాత్రమే మద్యం విక్రయించాలని ఎస్సై సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా…

Read More

ఒకే ప్ర‌మాదం… మూడు వాహ‌నాలు ధ్వంసం

తిరుప‌తి జిల్లా పెళ్ల‌కూరు మండ‌లం త‌ల్వాయిపాడు గ్రామ స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. నాయుడుపేట వైపు వ‌స్తున్న టిప్ప‌ర్‌ను… శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి నాయుడుపేట వ‌స్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంస‌మై అందులోని వారికి గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ స్తంభించ‌గా వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో కారు ఆగి ఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్టింది. అదేవిధంగా ఆగి ఉన్న…

Read More

సంగంలో లేగ దూడ‌ల అందాల ప్ర‌ద‌ర్శ‌న‌

నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ సుజని మెగా పశు వైద్య శిబిరం, లేగ దూడల అందాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్, డి ఎల్ డి ఓ చైర్మన్ సోమయ్య పాల్గొని మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. లేగ దూడల అందాల ప్రదర్శనను పరిశీలించారు. పలు లేగ దూడలకు,గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా పెయ్య దూడల పెంపకంపై రైతులకు పలు…

Read More

రెండు కార్లు ఢీ

రెండు కార్లు ఢీకొని…న‌లుగురికి గాయాలైన సంఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం చంద్ర‌శేఖ‌ర పురం జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. స్థానికుల వివ‌రాల మేర‌కు…ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రెండు కార్లు ఢీకొన్న‌ట్లు స్థానికులు వెల్లడించారు. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను 108 వాహ‌నం ద్వారా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Read More

క‌ట్ట‌మంచిలో భ‌గ్గుమ‌న్న రాజ‌కీయ క‌క్ష్య‌లు

పూతలపట్టు మండల వైసీపీ కన్వీనర్ వావిల్ తోట శ్రీకాంత్ పై…గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌…చిత్తూరు కట్టమంచిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో శ్రీ‌కాంత్‌తోపాటు…మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. క్ష‌గాత్రుల్ని వైసీపీ నాయ‌కులు, కుటుంబ స‌భ్యులు చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో…క‌ట్ట‌మంచిలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ విష‌యం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజ‌యానంద‌రెడ్డి దాడిలో గాయ‌ప‌డ్డ వారిని ప‌రామ‌ర్శించారు. దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు….

Read More

ఇందుకూరుపేట‌లో క్ష‌ణాల్లో మారిన వాతావ‌ర‌ణం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలో ఒక్క సారిగా న‌ల్ల‌టి ద‌ట్ట‌మైన మేఘాల‌తో ఈదూరు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో విద్యార్థులు, వాహ‌న‌దారులు కాస్త ఇబ్బందుల‌కు గుర‌య్యారు. క్ష‌ణాల్లోనే వాతావ‌ర‌ణం ఛేంజ్ అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కు కురిసిన భారీ వ‌ర్షం ప‌డిన దాఖ‌లాలు లేకుండా….సాధార‌ణ వాతావ‌ర‌ణంగా మారిపోయింది

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు,ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రగతి నివేదికను…

Read More

క‌మిష‌న‌ర్ గారు…ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించండి

నెల్లూరు న‌గ‌రంలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని…క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ని ఎమ్మెల్సీ, వైసీపీ న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కోరారు. అభివృద్ధి, పెండింగ్ ప‌నుల విష‌యాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని…ఆయ‌న వైసీపీ కార్పొరేట‌ర్ల‌తో క‌లిసి కార్పొరేష‌న్ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కెనాల్ రివీట్ మెంట్ వాల్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. అక్కడ గోడ ఎత్తు పెంచడం కానీ… లేదా…

Read More