పథకాలు అమలుపై కలెక్టర్ ఆరా…!

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. క్షేత్రస్థాయిలోపథకాలు అమలును స్వయంగా సందర్శించారు. వెలకపాడులో నిర్మాణంలో ఉన్న గోకులం షెడ్డు ను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాడి పశు పోషణ లాభనష్టాలను తెలుసుకున్నారు. అదే విధంగా స్థానిక సమస్యలను అడగగా చెరువుకు సోమశిల నీరు రానివ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ కాలువల నిర్మాణం చేయించాలని కోరగా, ప్రాదాన్యత ప్రకారం మంజూరు చేస్తామని కలెక్టర్…

Read More

గాయ‌ప‌డిన జ‌హీర్‌, ముజీర్ ల‌ను ప‌రామ‌ర్శించిన ప‌ట్టాభి

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీ వ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న తెలిసిందే. ఈ దాడిలో నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌, జ‌మీర్‌ల‌తోపాటు…ముజీర్ వ‌ర్గంలో ముజీర్‌, మునీర్‌, వారి మేన‌ల్లుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌హీర్ నెల్లూరు అపోలో ఆసుప‌త్రి చికిత్స పొందుతున్నాడు. ముజీర్ వ‌ర్గం నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ…

Read More

పిల్ల‌ల‌కి రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలి…

జిల్లాలో సుమారు 80 కోట్లతో ఉపాధి హామీ పథకం కింద పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలాల్లో క‌లెక్ట‌ర్‌ పర్యటించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం వింజమూరు మండలం నంది గుంటలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. నంది గుంటలోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ కేంద్రాన్ని సందర్శించి…

Read More

ప్ర‌యాణికుల‌తో గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాలి

తిరుపతి జిల్లా నాయుడుపేటలో డీఎస్పీ చెంచుబాబు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, ప్రజా రవాణాపై అవగాహన కల్పించారు. పట్టణంలోని ఆటోస్టాండ్ నిర్వహణ, వన్ వే నియమావళి,రాత్రులు ప్రయాణికులతో గౌరవంగా వ్యవహరించం వంటివి డ్రైవర్లులకు డీఎస్పీ వివరించారు. ఆటో యజమానులు, డ్రైవర్లు వివరాలను డీఎస్పీ కార్యాలయం అందించాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమంలో టౌన్ సీఐ బాబీ,ఎస్ఐ శ్రీహరి,పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఎక్సైజ్ సీఐ లైసెన్స్ ఇవ్వ‌డం లేదు

పొదలకూరు ఎక్సైజ్ సీఐ తమ మద్యం షాపుకు సంబంధించిన పర్మినెంట్ లైసెన్స్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని… మద్యం షాపు లైసెన్స్ హోల్డర్ కడియాల లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు‌. పొద‌ల‌కూరులోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.

Read More

ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండ‌ర్లు

దీపం-2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లను ప్ర‌భుత్వం పంపిణీ చేస్తోంద‌ని… చిత్తూరు క‌లెక్ట‌ర్ విద్యాధ‌రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిత్తూరులో క‌లెక్ట‌రేట్‌లో ఆమె మీడియా స‌మావేశం నిర్వ‌హించి దీపం -2 ప‌థ‌కానికి స‌బంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేశారు. డిసెంబర్ నుండి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ నుండి జూలై వరకు ఒక సిలిండర్, ఆగస్టు నుండి నవంబర్ వరకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత రీఫిల్లింగ్ చేసుకోవాల‌ని తెలిపారు. బి పి ఎల్…

Read More

న‌వంబ‌ర్ 16న సోమేశ్వ‌రాల‌య పునఃనిర్మాణ శంఖుస్థాప‌న‌

నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలొని పలు ప్రాంతాలు గతంలో వచ్చిన వరదలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర దేవాలయం పునర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్…

Read More

జిల్లా ప్ర‌జ‌లంద‌రూ ప‌ర‌మేశ్వ‌రుడి ఆశీస్సులు పొందాలి

వీపీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో…న‌వంబ‌ర్‌ 8, 9, 10వ తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయ‌ని..కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు నగరం వి. ఆర్‌. సి మైదానంలో జ‌రుగుతున్న కార్తీక ల‌క్ష దీపోత్స‌వ ఏర్పాట్ల‌ను ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డితో క‌లిసి ఆమె ప‌రిశీలించారు. ల‌క్ష దీపోత్స‌వంలో పాల్గొనే భ‌క్తులంద‌రికి ఎక్క‌డా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవాల‌ని వేమిరెడ్డి దంప‌తులు…క‌మిటీ స‌భ్యుల‌కి సూచించారు….

Read More

గంజా గ్యాంగ్ అరెస్ట్

తడ శ్రీ సిటీ వద్ద నలుగురు గంజాయి దొంగల అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 3 ల‌క్ష‌ల విలువ చేసే 20.8 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుప‌తి జిల్లా…నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. గంజాయి విక్రయించినా… గంజాయి సేవించి పట్టుబడిన కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ మేర‌కు…నిందితుల్ని మీడియా ఎదుట హాజ‌రుప‌ర‌చి…కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను డీఎస్పీ వెల్ల‌డించారు. ఈ నలుగురు గంజాయి స్మగ్లర్లను…

Read More

మైన‌ర్ బాలిక కేసులో ఎవ‌ర్ని వ‌ద‌లొద్దు…

ఓ మైన‌ర్ బాలిక‌పై ప‌లు అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో…ఎవ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని…నిందితులంద‌రికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్ పోలీసుల్ని కోరారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని టిడ్కో గృహంలో నివాసం ఉంటున్న‌…బాధిత మైన‌ర్ బాలిక కుటుంబాన్ని ఆయ‌న జ‌న‌సైనికుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై కుటుంబ స‌భ్యుల్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని వారికి అజ‌య్‌కుమార్ ధైర్యాన్ని క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో…టిడ్కో గృహాల్లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల్ని ల‌బ్దిదారులు…

Read More