వారిని కూడా అరెస్ట్‌ చేయండి

సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారిపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వైసీపీ శ్రేణుల‌తో క‌లిసి వ‌చ్చి నెల్లూరు వేదాయ‌పాలెం పోలీస్‌స్టేష‌న్‌లో కాకాణి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన అనేకమంది అసభ్యకర పోస్టులు చేశారని కానీ…

Read More

ఉద‌య‌గిరి వాసి జ‌న్మ‌నీలో మృతి

ఉదయగిరిలోని బీసీ కాలనీకి చెందిన ఉపేంద్ర రెడ్డి ఎమ్మెస్ ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్ళారు. గ‌డిచిన రెండు రోజులుగా అతనికి ఫోను చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాకపోవడంతో కలవరపడ్డారు. అనంతరం అతని స్నేహితులను ఫోన్ ద్వారా సంప్రదించిన… కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త అందింది. ఉపేందర్ రెడ్డి హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు స్నేహితులు తెలుపగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతి విష‌యమై అక్క‌డి వారు ఎలాంటి స‌మాచారం…

Read More

పేదల మధ్య తటవర్తి రమేష్ జన్మదిన వేడుకలు

కావలి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తన జన్మదిన వేడుకలను పేదలు, అనాధ‌ల ఆదరణ కేంద్రంలో పిల్లల మధ్యన జరుపుకున్నారు. ముంగమూరు ఆదరణ కేంద్రంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వారికి భోజనం, పోషకాహార సామాగ్రి అందజేశారు. అదే విధంగా కావలి ఏరియా వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు, భోజనం పంపిణీ చేశారు. 17వ వార్డు బుడంగుంట ఎస్టీ కాలనీలో భోజనం, నిత్యవసర సరుకులు అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు భోజనం,…

Read More

డ్ర‌గ్స్‌.. భ‌విష్య‌త్తును నాశ‌నం చేస్తుంది

నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఉమా మహేశ్వరి కళ్యాణమండపంలో.. కలువాయి ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సూచనల మేరకు విద్యార్థులకు యాంటీ డ్రగ్స్‌, యాంటీ ర్యాగింగ్‌ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్‌ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు కలువాయి ఎస్సై సుమన్ వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు.. వ్యసనంగా మారి.. భవిష్యత్తును నాశనం చేస్తుందని.. కాబట్టి విద్యార్థులు అవగాహన…

Read More

మాద్యక ద్రవ్యాలు, ఈవ్ టీచింగ్, సైబర్ క్రైమ్ పై విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అవగాహన

మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణం లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల నివారణ, ఈవ్ టీచింగ్- ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మోటార్ వెహికిల్ చట్టం, సీ.సీ కెమెరాల ఏర్పాటు పై పొదలకూరు ఎస్. ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ శివరామకృష్ణ రెడ్డి ,ఎస్.ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల…

Read More

గంజాయి.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఇందుకూరుపేట మండలం.. కొత్తూరు వశిష్ట కళాశాలలో ఎస్ఐ నాగార్జున రెడ్డి .. డ్రగ్స్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాద‌క‌ద్రవ్యాలకు విద్యార్థులు, యువ‌త దూరంగా ఉండాల‌న్నారు.అదేవిధంగా సైబర్ నేరాలు. రోడ్డు ప్రమాదాలు. ఇతర మత్తు పదార్థాలు. దుర్వినియోగం వీటిని కట్టడి చేయాలని విద్యార్థులకు అవగాహన క‌ల్పించారు. ఈ కార్యక్రమంలో వశిష్ట కళాశాల ప్రిన్సిపాల్ వై.వి సుబ్రమణ్యం, విద్యార్థులు పోలీసువారి సిబ్బంది పాల్గొన్నారు.

Read More

డ్రగ్స్ కు బానిసలు కావద్దు…!జీవితాలను నాశనం చేసుకోవద్దు…!

మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కావలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. కావలి పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కావలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు. వీటిని అమ్మినా, వాడినా పోలీసు శాఖ తీసుకునే చర్యలు, జరిగే నష్టాలను వివరించారు. అదేవిధంగా సెల్ ఫోన్లల్లో అనేక యాప్…

Read More

ఆ…నీటిని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే…!

స‌ముద్రం, జలాశయం, చెరువులలో నీటిని చూసి ఎవరైనా దిగాలంటే భయపడక తప్పదు.. అయితే చిన్నపాటి నీటిని చూసి కూడా ద్విచక్ర వాహనదారులు భయపడి ప్రమాదంలోకి వెళుతున్న పరిస్థితి.. కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నా ఎక్కడా హెచ్చరిక బోర్డులు కనిపించని వైనం. గతంలో వచ్చిన వరదలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం ముందు భాగంలో ఉన్న ఆఫ్రాన్ ప్రాంతం దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరమ్మత్తుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. కొన్ని రోజులు ఆఫ్రాన్ ప్రాంతం పనులు…

Read More

గిరిజ‌నుల‌కు భ‌రోసా ఇచ్చిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌

గిరిజ‌నుల స‌మ‌స్య‌లను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించొద్దంటూ జిల్లా క‌లెక్ట‌ర్ ఒ. ఆనంద్ ఆదేశించారు. ఈమేర‌కు క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడ‌వ‌లూరు మండ‌లంలోని గిరిజ‌న కాల‌నీల‌లో ప‌ర్య‌టించారు. వారు ప‌డుతున్న ఇబ్బ‌దుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అత్య‌ధిక స‌మ‌యం వారితో చ‌ర్చించారు. చాలా కుటుంబాల్లో ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్న‌ట్లు వారు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారుల‌తో…

Read More

ఆ…8 ట‌న్నుల కందిప‌ప్పుకి లెక్క ఏది…?

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వాకాడు మండ‌లంలోని సివిల్ స‌ప్ల‌య్స్ గోదాములో…గ‌త మూడేళ్లుగా సుమారు 8 ట‌న్నుల కందిప‌ప్పు నిల్వ ఉంది. గ‌త మూడేళ్లుగా కందిప‌ప్పుని ఎందుకు ప్ర‌జ‌ల‌కి పంపిణీ చేయ‌కుండా, ఎందుకూ ప‌నికి రాకుండా ఉంచార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్‌న్యూస్ ప్ర‌తినిధి గోదాముకు వెళ్లి ప‌రిశీలించ‌గా అక్క‌డ నిల్వ ఉంచిన కందిప‌ప్పు, బియ్యం కంట‌పడ్డాయి. ఎందుకు నిల్వ ఉంచార‌ని…వెంట‌నే సంబంధిత అధికారుల్ని వివ‌ర‌ణ కోర‌గా…మాకేం తెలియ‌దంటూ… పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్నారు. దీంతో…

Read More