Year: 2024

బరితెగిస్తున్న గంజాయి స్మగ్లర్లు
గంజాయికి అడ్డాగా నెల్లూరు మారుతోందా..? విశాఖ.. ఒడిస్సా..ల నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు భారీగా తరలి పోతోందా..? రోడ్డు, రైల్వే మార్గాలనే ఎంచుకున్నారా..? వయా నెల్లూరులో దిగుమతి అవుతోందా..? నెల్లూరు కేంద్రంలోనూ గంజాయి స్లీపర్ సెల్స్ ఉన్నారా..? ఓయో రూములు, లాడ్జీలు, గెస్ట్ ఇన్ లనే వారు కేంద్రాలుగా చేసుకుని లావాదేవీలు చేస్తున్నారా..? ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు గంజాయి ముఠాలపై దృష్టి పెట్టడంలేదు..? గతంలో పట్టుబడ్డ నిందితుల నుంచి కూపీ లాగినా.. సమూలంగా ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు..?…

వైద్యురాలి ఘటన అమానుషం
కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను నిరసించిన జోహార్ భారతి కళాశాల విద్యార్థులు కోల్కత్తాలోని వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై కావలి పట్టణంలోని జవహర్ భారతి జూనియర్ కాలేజ్ , బి.ఎస్.సి నర్సింగ్, పారామెడికల్ విద్యార్థిని ,విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జవహార్ భారతి కాలేజ్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. బ్రిడ్జి సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. అనంతరం జవహర్ భారతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్…

మలేషియాలో ప్రమాదం….
కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లి కి చెందిన జి.పళని కుమార్తె విజయలక్ష్మి(40) మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ ఆమె ఆచూకి దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఎమ్మెల్సీ…

విశ్వసాయి ఎస్ఆర్కేలోఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో… ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన కృష్ణుడు, గోపికల వేషధారణలు…కృష్ణుడి పాటలకు వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలోనే ఉట్టి మహోత్సవ వేడుకని కన్నుల పండువగా నిర్వహించారు. పలువురు కృష్ణులు ఉట్టి కొట్టి సందడి చేశారు. తమ స్కూల్లో చదువుతోపాటు అన్నీ పండుగలను, ఉత్సవాలను ఘనంగా జరుపుతామని విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ తెలిపారు….

వెంకయ్యస్వామి ఆరాథనోత్సవాల్లో సోమిరెడ్డి
స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడిలో వెలసి ఉన్న…వెంకయ్యస్వామి ఆశ్రమంలో 42వ ఆరాధన మమహోత్సవం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్యస్వామి వారికి సోమిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని…

ఎషన్షియ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి
అచ్యుతాపురం ఎషన్షియ ఫారా కంపెనీలో జరిగిన ప్రమాదంపై యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ… నెల్లూరులోని లేబర్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా సీఐటీయూ ధర్నా చేపట్టింది. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని…తక్షణమే మృతులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. అదే విధంగా నెల్లూరు జిల్లాలోని పరిశ్రమల్లో కార్మికులకు భద్రత, రక్షణ కల్పించాలని అధికారుల్ని కోరారు. అనంతరం…ఇండస్ట్రీయల్ కారిడార్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ లు…

కేసులు.. అరెస్టులు.. జైళ్లకు భయపడం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చంద్రబాబు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడమని…మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. ఏమి నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని తెలిపారు. అధికారులు…

ఎట్టకేలకు పిన్నెల్లి విడుదల…
జైలు వద్ద రామకృష్ణారెడ్డికి స్వాగతం పలికిన మాజీ మంత్రులు 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమయంలో…ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలుకు పంపించిన విషయం విధితమే. ఈవీఎం ధ్వంసం కేసులో…సుమారు 59 రోజులు ఆయన రిమాండ్ అనుభవించారు. ఈ క్రమంలో పిన్నెల్లికి ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆగస్ట్ 23వతేదీ సాయంత్రమే రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా…మళ్లీ పీడీ…

జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం సమీపంలో తెల్లవారు జామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్లు మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఉద్యోగులు, స్కూల్స్, కాలేజీ లకు వెళ్ళేసమయం కావడంతో మరింత ట్రాఫిక్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.