Year: 2024
శ్రీవారిని దర్శించిన బోడె, నటుడు తుషార్ కపూర్
వేద ఆశీర్వావచనం, తీర్ధ ప్రసాదాలు అందచేసిన టీటీడీ అధికారులు తిరుమల తిరుపతిలోని వీఐపీ బ్రేక్ సమయంలో…శ్రీవారిని భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు :బోడె రామచంద్ర యాదవ్, ఇండియన్ యాక్టర్ తుషార్ కపూర్ లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో…వేద ఆశ్వీరావచనం, తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
గణేష్ ఉత్సవాలకు అనుమతులు సులభతరం
మండలంలో వినాయక ఉత్సవాల సంబంధించి అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చిందని సిఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావ్ మాట్లాడుతూ…ఉత్సవ నిర్వాహకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకువచ్చిందన్నారు. ఉత్సవాలు నిర్వహించే వారు 995095800 అనే వాట్సప్ నెంబర్ ద్వారా కానీ, Ganeshutsav.net web సైట్ లో…
కనీవినీ ఎరుగని రీతిలో లంబోదర సెంటర్లో చవితి వేడుకలు
నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్లో కనీవిని ఎరగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వీటిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్ లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐదు రోజులపాటు గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు…
కాంపౌండ్వాల్, మరుగుదొడ్లు కట్టిస్తా
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈఓ పరిశీలించారు. ముందుగా అరుణమ్మకు కోవూరు జెడ్పిటిసి శ్రీలత ,,ఎంపీపీ పార్వతి, ఎంపీడీవో శ్రీహరి, ఎంపీటీసీ వేణు, ఉపాధ్యాయులు పూలబొకే అందచేసి శాలువాలతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆనం దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ను…
విద్యార్థులకు దుస్తులు వితరణ
తల్లిదండ్రులను మరిచిపోతున్న ఈ రోజుల్లో వారి గుర్తుగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో స్ఫూర్తి దాయకమని కావలి విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు సి.హెచ్. బ్రహ్మయ్య తెలిపారు. కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని సాంఘీక సంక్షేమ శాఖ ఒకటో వసతి గృహం విద్యార్థులకు మేడికొండ డానియేలు జ్ఞాపకార్ధంగా ఆయన కుమారుడు సాంఘీక సంక్షేమ శాఖ ఒకటో వసతి గృహం విద్యార్థులకు సంక్షేమ అధికారి ఉమా శంకర్ స్వరూప్ దుస్తులు వితరణ చేశారు. ముఖ్య అతిథిగా…
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది
నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండల కేంద్రంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీడీఓ ప్రత్యూష, ఏవో లక్ష్మణకుమార్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని శాలువాలతో సత్కరించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు మధుసూధన…హేమసుందరరావు….మాట్లాడారు… ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్దన్… కృష్ణారెడ్డి…కృష్ణకుమార్…సిబ్బంది… బాపనపాటి సుబ్రమణ్యం… తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల పాత్ర అసామాన్యం
ఓజిలిలో ఘనంగా టీచర్స్ డే తిరుపతి జిల్లా ఓజిలి మండలం విద్యాశాఖ కార్యాలయంలో టీచర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా ఎంఈఓ శైలజా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టి.నారాయణ, పీ.శంకరయ్య, ఎస్. శంకరయ్యలను ఎంపీడీవో రజనీకాంత్, ఎమ్మార్వో పద్మావతిలతో కలిసి సత్కరించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపోవడం తమ వృత్తి గర్వకారణమని ఎంఈవో శైలజ అన్నారు. సమాజ హితానికి, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలోఉపాధ్యాయుల పాత్ర అసామాన్యమైనదని ఎంపీడీవో,ఎమ్మార్వోలు కొనియాడారు.
మామిడాల శాంతికి అంతిమ వీడ్కోలు…
భారీగా తరలి వచ్చిన తమ్ముళ్లు, అభిమానులు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు మామిడాల మధు…తల్లి మామిడాల శాంతి మరణించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం మైపాడు గేటు సెంటర్ వద్ద ఉన్న మామిడాల నివాసం నుంచి…శాంతి అంతిమ యాత్ర జరిగింది. శాంతిని చివరి చూపు చూసేందుకు…తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మామిడాల మధు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.