నాయుడుపేట‌లో వేలం పాట‌

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలోని శ్రీకాళహస్తిశ్వర వేణుగోపాలు స్వామి భూములను కౌలుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. సంత్సర కాలానికి 19ఎకరాలను బహిరంగంగా వేలం ద్వారా పలువురు రైతులు దక్కించుకున్నారని ఈవో రవి కృష్ణా తెలిపారు. ఈ వేలం ద్వారా లక్షా యాబైవేల వంద రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More

నాయుడుపేట‌లో రోడ్డెక్కిన కార్మికులు

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ మున్సిపల్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వర్షా కాలంలో పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, సామాగ్రీని ఇవ్వాలని చాపల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమానికి సిద్దమవుతాన‌ని చాపల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More

న‌వదంపతుల కిడ్నాప్ కలకలం…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నవదంపతుల కిడ్నాప్ కలకలం రేపింది. వెంకటగిరి మండలం సీసీ కండ్రిగకు చెందిన వెల్లూరు రాజా(23), ఆయన భార్య పెంచలమ్మ(20) రెండు రోజుల క్రితం దీపావళి పండగకు చిట్వేల్ మండలంలోని అత్తగారి ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో వారిని ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. రాపూరు అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి రాజాను పోలీసులు గుర్తించారు. పెంచలమ్మ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు…

Read More

సంక్రాంతి నాటికి రోడ్ల మీద గుంత‌లుండ‌వ్‌…

సంక్రాంతి నాటికి రూర‌ల్‌లో రోడ్ల మీద గుంత‌లు లేకుండా చేయ‌డ‌మే నా బాధ్య‌త అని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయ‌న జిల్లా కలెక్టర్ ఆనంద్ , టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుంత‌లు పూడ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ముందుగా క‌లెక్ట‌ర్ కి ఎమ్మెల్యే పూల‌బొకే అంద‌చేసి ఘ‌న…

Read More

ప్ర‌శాంత‌మ్మ చొర‌వ‌… తుమ్మ‌గుంట అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యానికి పూర్వ‌వైభ‌వం

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌లంలోని తుమ్మ‌గుంట గ్రామంలో భ‌క్తుల కొంగుబంగార‌మై.. విరాజిల్లుతున్న శ్రీ గురునాథ‌స్వామి అయ్య‌ప్ప స్వామి ఆల‌యం పాల‌కుల నిర్ల‌క్ష్యం.. ప‌ర్య‌వేక్ష‌ణ‌లేని కార‌ణంగా ఆల‌యం ఆల‌నాపాల‌న‌తోపాటు.. ప‌రిశ‌రాలు అప‌రిశుభ్రంగా.. స‌రైన వ‌స‌తులు లేకుండా.. భ‌క్తుల‌కు అసౌక‌ర్యంగా.. ఇబ్బందిక‌రంగా ఉన్న వైనంపై సోమ‌వారం.. అయ్య‌ప్పా.. ఇదేంద‌య్యా.. ప్ర‌శాంత‌మ్మా.. మీరైనా ఇటు చూడండ‌మ్మా.. అనే ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ఎన్‌-3 ద్వారా వెలుగులోకి తేవ‌డం తెలిసిందే. ఎంతో విశిష్ట‌త‌.. ప్రాచీనం.. ప్రాధాన్య‌త క‌లిగి ఉండ‌టంతోపాటు అక్క‌డి అయ్య‌ప్ప‌స్వామి మ‌హిమ‌లుక‌లిగి.. కోరిన…

Read More

16 ఏళ్లుగా మంచి కార్య‌క్ర‌మం…

కార్తీక మాసం సంద‌ర్భంగా గ‌త 16 ఏళ్లుగా మూలాపేట శివాల‌యంలో శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ చేయ‌డం మంచి దైవ కార్య‌క్ర‌మ‌మ‌ని..డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ అన్నారు. న‌గ‌రంలోని మూలాపేట శివాల‌యంలో….ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో శివ‌మాల భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా రూప్‌కుమార్ యాద‌వ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా రూప్ కుమార్ యాద‌వ్ చేతుల మీదుగా శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌దానం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇంత మంచి కార్య‌క్ర‌మం…

Read More

స‌హ‌వాస దోషం..

రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. తనకి ప్రాణహాని ఉందని…పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్ కి గుర్తు లేదా..? అని సూటిగా ప్ర‌శ్నించారు. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదని…. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం…

Read More

ఎన్టీఆర్‌ని ఎవ‌రు చంపేశారో అంద‌రికి తెలుసు…

రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే.. అందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు దుష్ప్రచారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని…మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. చంద్ర‌బాబునాయుడుపై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ ని ఎవరు చంపేసారో.. ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. అయన చనిపోవడానికి కారకులు చంద్రబాబు కాదా..?? అని సూటిగా ప్ర‌శ్నించారు.

Read More

ప‌ట్టువ‌స్త్రాలు కాదు…గోచి గుడ్డ ఇస్తాడు

ఐదు నెల‌ల చంద్ర‌బాబునాయుడు పాల‌న‌పై మాజీ మంత్రి కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్డ్ లో ఫెయిల్ అయ్యావ్ అని మండిప‌డ్డారు. నిత్యావసరాలు ధరలు పెంచేయ్యడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కొలేక‌నే జగన్ కుటుంబం మీద బురద చళ్ళుతున్నారని విమ‌ర్శించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయ‌డంలో నారా లోకేష్ దిట్ట అని.. జగన్ కుటుంబం గురించి నీచంగా…

Read More

సూప‌ర్ సిక్స్…సూప‌ర్ ప్లాప్ ప్ర‌భుత్వం

సూప‌ర్ సిక్స్ కాద‌ని…సూప‌ర్ ప్లాప్ అని…సీఎం చంద్ర‌బాబునాయుడు తీసుకువ‌చ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై మాజీ మంత్రి కాకాణి సెటైర్లు వేశారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో కాకాణి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. చంద్రబాబు డైవర్ష‌న్‌ పాలిట్రిక్స్ కి తెరలేపారని.. మాటలు తప్ప.. చేతలు శూన్యమ‌ని విమ‌ర్శించారు. కోటి 47 లక్షల రేషన్ కార్డ్స్ ఉంటే.. సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని మండిప‌డ్డారు. చంద్రబాబు మోసపురిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Read More