సూళ్లూరుపేట శివాలయంలో భ‌క్తులు కిట‌కిట‌

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల‌చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్తీకమాసం ఐదవ రోజు పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీకమాస దీపం పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి వేడుకలలో పుట్ట వద్ద ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో తిరిగి పుట్ట ద‌ర్శ‌నం అనంత‌రం ఉప‌వాస‌దీక్ష‌ను భ‌క్తులు విర‌మించారు. ఈ సంద‌ర్భంగా…

Read More

సిటీ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కార్పొరేట‌ర్లు

నెల్లూరు న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలో…న‌గ‌ర మేయ‌ర్ పోట్లూరి స్ర‌వంతి అధ్య‌క్ష‌త‌న కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్లు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌పై కౌన్సిల్ స‌మావేశంలో గ‌ళ‌మెత్తారు. ఈ క్ర‌మంలో వైసీపీ, టీడీపీ కార్పొరేట‌ర్ల మ‌ధ్య వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. నువ్వెంత అంటే…నువ్వెంత…

Read More

హ‌ఠాత్తుగా సునామీ వ‌స్తే…మ‌నం ఏం చేయాలో తెలుసా…?

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్రం తీరం వ‌ద్ద‌… ఏపీఎస్ డిఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 9వ బెటాలియన్ వెంకటగిరి సునామీపై మాక్ డ్రిల్ నిర్వ‌హించారు. సునామి హఠాత్తుగా సంభవించినప్పుడు తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలపై ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు చే ప్రజలకు అవగాహన కల్పించారు. అనంత‌రం త‌హ‌సీల్దార్ రామ‌య్య మాట్లాడారు. సునామీ వంటి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు ఏ విధంగా ర‌క్షించుకోవాల‌న్న దానిపై మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌డం…

Read More

చిట్టమూరులో విషాదం…

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది… స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలో మునిగి వీరేంద్ర సాయి (14) అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు… పాఠశాల వదిలిన తర్వాత తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు.. ఇసుక తవ్వకాలు జరిపిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండడంతో వీరేంద్ర సాయి ఇసుకలో కూరుకుపోయి మునిగిపోయాడు.. మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా…

Read More

కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామి నాగుల పుట్ట…

కోవూరులో వైభవంగా నాగుల చవితి వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు NTS గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానంలో నాగుల చవితి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నాగుల పుట్టలో పాలు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నాగుల పుట్టకు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉందని భక్తులు తెలిపారు. రావి చెట్టు యాప చెట్టు…

Read More

సూట్‌కేస్‌లో శ‌వం..!

ఖ‌ర్మ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌దంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజం .. కొద్ది గంట‌ల్లోనే ఓ తండ్రి, కూతురు విష‌యంలో నిరూపించింది.. న‌గ‌ల కోసం ఓ వృద్ధురాలిని అతి కిరాత‌కంగా చంపేశారు.. ఆమె శ‌వాన్ని సూట్ కేసులో పెట్టుకుని.. మాయం చేసేప‌నిలో ఊరుగాని ఊరు.. రాష్ట్రంగాని రాష్ట్రం వెళ్లి..పోలీసుల‌కు దొరికిపోయారు. అన్యంపుణ్యం ఎరుగని ఆ వృద్ధురాలిని కిరాత‌కంగా చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. చెన్నైలో ప‌డేద్దామ‌నుకుని ఇలా.. పోలీసుల‌కు దొరికిపోవ‌డంతో ఖ‌ర్మ‌సిద్ధాంతం నిజ‌మ‌ని నిరూపించింది. ఈ హ‌త్య జ‌రిగిన…

Read More

వింజ‌మూరులో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగేంద్రుడికి భ‌క్తులు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా వింజ‌మూరు మండ‌లంలో నాగుల చ‌వితి పండుగ వైభ‌వంగా జ‌రిగింది. మండ‌లంలోని ఊటుకూరు ప్రాంతంలో నాగేంద్రు స్వామి పుట్ట‌కి భ‌క్తులు విశేష పూజ‌లు చేశారు. మ‌హిళలు పుట్ట చుట్టూ దారం చుట్టి ప్ర‌ద‌క్ష‌ణాలు చేసి…పాలుపోసి…స్వామి వారికి నైవేధ్యాలు స‌మ‌ర్పించారు. మహిళలు ఉపవాసాలు ఉంటూ నిండు మనుసుతో ఆ నాగేంద్రునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Read More

కుప్పంలో వైసీపీ భారీ షాక్‌…

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ త‌గిలింది. కుప్పం మున్సిప‌ల్ చైర్మ‌న్ డాక్ట‌ర్ సుధీర్ వైసీపీ రాజీనామా చేసి…తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్ర‌బాబు నాయుడును డాక్ట‌ర్ సుధీర్‌ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సుధీర్‌కి సీఎం చంద్ర‌బాబు పార్టీ కండువా క‌ప్పి టీడీపీలో సాద‌రంగా ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబుతో…

Read More

ఇందుకూరుపేట‌లో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగుల పుట్ట‌ల‌కు భ‌క్తులు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేటలో నాగుల చ‌వితి పండుగ‌ను భ‌క్తులు వైభ‌వంగా నిర్వ‌హించారు. మండ‌లంలోని నాగులమ్మ‌ పుట్ట‌ల‌కు భ‌క్తులు పుట్ట చుట్టూ దారం చుట్టి…పాలు పోసి…నైవేధ్యాలు సమ‌ర్పించి దీపారాధ‌న చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాగుల చ‌వితి విశిష్ఠ‌త‌ను…గిరిధర్ స్వామి, సత్య కృష్ణ స్వామి, మురళీకృష్ణ స్వామి మీడియా ద్వారా తెలియ‌జేశారు.

Read More

సంగంలో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగ‌శిల‌ల‌కు పాల‌తో అభిషేకం చేసిన భ‌క్తులు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో నాగుల చవితి పండుగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భంగా భక్తులు నాగ శిలల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగ శిలలకు పాలతో అభిషేకం నిర్వహించి..శిలల వద్ద ఉన్న చెట్టుకు దారం కట్టి మొక్కుకున్నారు. అనంతరం సజ్జలు,పిండి ప్రసాదంగా పంచి పెట్టారు.

Read More