పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి..

  • స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి – సిపిఎం
  • అనంతసాగరం విద్యుత్ సబ్ స్టేషను వద్ద నిరసన

విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ లను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ A.E కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెరగడంతో ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని, తగ్గిస్తామని ఎన్నికలో టీడీపి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్ లు వద్దని, పెడితే పగలగొట్టమని చెప్పిన ప్రతిపక్షంలో ఉండగా టిడిపి కూటమి నేతలు అధికారంలోకి రాగానే మాట తప్పి 15,484 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల భారాన్ని ప్రజల పై మోపి ఈ నెల నుండి పెంచిన విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

పాత విద్యుత్ మీటర్ లు తొలిగించి ఆదాని వారి స్మార్ట్ మీటర్ లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా ప్రజలు ఏకం అయి ప్రభుత్వాలను నిలదీయాలని అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలని, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అనంతసాగరం శాఖ సభ్యులు సందాని, ఫక్రూస, బాబు, కరీం, వెంకటేష్,రమేష్, మస్తాన్ జలీల్, షాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *