జ‌గ‌న్ పాల‌న‌పై క‌విత‌లు చ‌దివిన సోమిరెడ్డి

  • భారీ దోపిడీకి పాల్ప‌డిన అర‌బిందో
  • ముఖ్యమంత్రి, ఆరోగ్యాశాఖ మంత్రి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి
  • స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి

నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాల‌యంలో…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌… జగన్ పాలనలో దోపిడీ, కబ్జాలపై కవితలు చదివి వినిపించారు. 104, 108 అంబులెన్సు సర్వీసెస్ ను జీవికే నుండి తీసుకున్న అరబిందో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. జీవికే సంస్థకు ఇస్తున్న డబ్బు కంటే డబుల్ చేసి దోపిడీకి పాల్పడ్డట్టు నిర్దారణ అయ్యిందన్నారు. రోహిత్ రెడ్డి మైంటైన్ చేసి దోపిడీ చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలన్నారు. ప్రజల ప్రాణాలతో చల్లగాటమాడిన వారికి మరణ శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, ఆరోగ్యాశాఖ మంత్రి సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఛండశాసనులుగా మారాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *