భ‌గ‌త్ సింగ్ కాల‌నీలో కార్డెన్ సెర్చ్

నెల్లూరు న‌గ‌రం భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో గృహాలలో న‌వాబుపేట సీఐ అన్వ‌ర్‌బాషా ఆధ్వ‌ర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. సీఐ త‌న సిబ్బందితో క‌లిసి ఇంటింటికెళ్లి క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. స్థానిక ప్ర‌జ‌ల‌కి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఎవ‌రైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్వర్ భాషా హెచ్చరించారు.. పత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలించారు.

Read More

కోసుకుపోయిన రోడ్డు మార్జిన్‌…

గ‌త ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు…ఓ వాగు ఉధృతి కార‌ణంగా…తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం బాలాయపల్లి మండలం పరిధిలోని జయంపు హస్తకావేరి రోడ్డు కోసుకుపోయింది. నిత్యం ఆ ర‌హ‌దారి వైపు ప్ర‌యాణించే ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మాత్రం ఆద‌రిస్తే…అంతే సంగ‌తు అన్న చందాన మారింది ఈ ర‌హ‌దారి. ఇప్ప‌టికే ప‌లువురు వాహ‌న‌దారులు ప్ర‌మాదాల‌కు గురైన గాయాల పాలైన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ ర‌హ‌దారి కోత‌కు గురై ఏడాది అయినా…సంబంధించిత అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం అటు వాహ‌న‌దారులు,…

Read More

వైభ‌వం…ల‌క్ష దీపోత్స‌వం

భారీ సెట్టింగులు… ఆద్యంతం భక్తిపారవశ్యం నింపే శివ కేశవుల నామస్మరణతో నెల్లూరు నగరంలోని వి.ఆర్‌. సి మైదానం పులకించింది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి దంపతుల సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. కార్తీక మాస ల‌క్ష దీపోత్స‌వం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వీపీఆర్ దంప‌తుల‌కి అర్చ‌కులు వేద చంత్రోచ్చ‌ర‌ణ న‌డుమ అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ…

Read More

సంక్షేమ ప‌థ‌కాల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాలి

రాష్ట్రంలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేసేందుకు తగినన్ని నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. జిల్లా కమిటీ పిలుపులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం కమిటీ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అంద‌చేశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ… హామీలు ఇంత వరకు అమలు కాలేదని ఈ బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి సంక్షేమ…

Read More

జ్వాలాముఖి స‌న్నిధిలో పీఠాధిప‌తి రామానంద భార‌తిస్వామి

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శక్తి మాత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామానంద భారతి స్వామి దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు అర్చక బృందం ఆధ్వర్యంలో భార‌తి స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భారతీస్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారు మీడియాతో మాట్లాడారు… హిందూ ధర్మాన్ని…

Read More

బెల్టు పెడితే క్రిమిన‌ల్ కేసే

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో అక్రమంగా ఓ వ్యక్తి మద్యం అవుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి రాత్రి దాడులు నిర్వహించారు .ఈ దాడుల్లో పాశం కృష్ణయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు లైసెన్స్ కలిగిన షాపు దారులు మాత్రమే మద్యం విక్రయించాలని ఎస్సై సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా…

Read More

ఒకే ప్ర‌మాదం… మూడు వాహ‌నాలు ధ్వంసం

తిరుప‌తి జిల్లా పెళ్ల‌కూరు మండ‌లం త‌ల్వాయిపాడు గ్రామ స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. నాయుడుపేట వైపు వ‌స్తున్న టిప్ప‌ర్‌ను… శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి నాయుడుపేట వ‌స్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంస‌మై అందులోని వారికి గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ స్తంభించ‌గా వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో కారు ఆగి ఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్టింది. అదేవిధంగా ఆగి ఉన్న…

Read More

సంగంలో లేగ దూడ‌ల అందాల ప్ర‌ద‌ర్శ‌న‌

నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ సుజని మెగా పశు వైద్య శిబిరం, లేగ దూడల అందాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్, డి ఎల్ డి ఓ చైర్మన్ సోమయ్య పాల్గొని మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. లేగ దూడల అందాల ప్రదర్శనను పరిశీలించారు. పలు లేగ దూడలకు,గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా పెయ్య దూడల పెంపకంపై రైతులకు పలు…

Read More

రెండు కార్లు ఢీ

రెండు కార్లు ఢీకొని…న‌లుగురికి గాయాలైన సంఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం చంద్ర‌శేఖ‌ర పురం జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. స్థానికుల వివ‌రాల మేర‌కు…ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రెండు కార్లు ఢీకొన్న‌ట్లు స్థానికులు వెల్లడించారు. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను 108 వాహ‌నం ద్వారా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Read More

క‌ట్ట‌మంచిలో భ‌గ్గుమ‌న్న రాజ‌కీయ క‌క్ష్య‌లు

పూతలపట్టు మండల వైసీపీ కన్వీనర్ వావిల్ తోట శ్రీకాంత్ పై…గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌…చిత్తూరు కట్టమంచిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో శ్రీ‌కాంత్‌తోపాటు…మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. క్ష‌గాత్రుల్ని వైసీపీ నాయ‌కులు, కుటుంబ స‌భ్యులు చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో…క‌ట్ట‌మంచిలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ విష‌యం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజ‌యానంద‌రెడ్డి దాడిలో గాయ‌ప‌డ్డ వారిని ప‌రామ‌ర్శించారు. దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు….

Read More