
ఎన్టీఆర్ని ఎవరు చంపేశారో అందరికి తెలుసు…
రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే.. అందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు దుష్ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని…మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నెల్లూరు డైకస్ రోడ్డులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబునాయుడుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ని ఎవరు చంపేసారో.. ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. అయన చనిపోవడానికి కారకులు చంద్రబాబు కాదా..?? అని సూటిగా ప్రశ్నించారు.