కోవూరులో వైభ‌వంగా కార్తీక మాసం

తొలి సోమ‌వార సంద‌ర్భంగా స్వామి, అమ్మ‌వార్ల‌కు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలసిఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసం పూజ‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా దేవదేవేరులకు విశేష పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి ఆల‌య ప్రాంగ‌ణంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌ దీపాలు వెలిగించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి తీర్ధ…

Read More

సంగంలో వైభ‌వంగా తొలి కార్తీక సోమ‌వారం

నెల్లూరు జిల్లా కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు . భక్తులు వేకువ జామునే ఆలయానికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Read More

రూర‌ల్ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కోటంరెడ్డి…

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని…అధికారుల్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. నెల్లూరు రూరల్లో మూడు బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని… అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయ‌ని…నేను పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వాటిని ఆపేశార‌ని…

Read More

ఎంపీ అంటే లెక్క‌లేదా…అగౌరప‌రుస్తారా…

నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో…డీఆర్సీ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వేదిక‌పై ఎంపీకి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న స‌భ నుంచి వెళ్లిపోయారు. వెంట‌నే ఎంపీ వేమిరెడ్డిని స‌ముదాయించేందుకు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు ప్ర‌య‌త్నించారు. నేను వెన‌క్కి రాలేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసి జ‌డ్పీ నుంచి ఆయ‌న‌ వెళ్లిపోయారు. అక్క‌డే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి సైతం ఎంపీ వెంట వెళ్లిపోయారు.

Read More

విద్య‌కు పెద్ద‌పీఠ వేసిన కూట‌మిప్ర‌భుత్వం

పేద విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద‌పీఠ వేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరులోని బ‌లిజ భ‌వ‌న్‌లో డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో బ‌లిజ మెరిట్ విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అంద‌జేసే కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వ‌ళ‌న చేసి సభను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణను బ‌లిజ సంఘం నేత‌లు గజమాల, శలవాలతో ఘ‌నంగా స‌త్క‌రించారు. అక్క‌డికి విచ్చేసిన విద్యార్థుల‌తో మంత్రి నారాయ‌ణ…

Read More

ప్ర‌జ‌ల‌కి అంకితం..ఎన్టీఆర్ పార్క్

నందమూరి తారకరామారావు పార్కు అభివృద్ధి కావాలని స్థానిక ప్రజల చిరకాల కల ఈరోజు నెరవేరిందని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, అన్నమయ్య సర్కిల్ లో రూ. 2 కోట్ల వ్యయంతో నందమూరి తారకరామారావు పార్కు ను.. టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, టీడీపీ నేత గిరిధ‌ర్‌రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్ మారంరెడ్డి జ్యోతి ప్రియ‌ల‌తో క‌లిసి ఎమ్మెల్యే అట్ట‌హాసంగా…

Read More

డిసెంబ‌ర్ 14,15తేదీల్లో సీపీఎం 25 మ‌హాస‌భ‌లు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండ‌లంలో డిసెంబ‌ర్ 14,15 తేదీల‌లో సీపీఎం 25వ మ‌హాస‌భ‌లు జ‌రుగుతాయ‌ని మండ‌ల కార్య‌ద‌ర్శి కోటేశ్వ‌ర‌రావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం నేత‌లు మండ‌లంలో ప‌ర్య‌టిస్తూ…ఇంటింటికెళ్లి మీ వంతు ఆర్ధిక స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని…సీపీఎం 25వ మ‌హాస‌భ‌ల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని వారు కోరారు. అనంత‌రం కోటేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సీపీఎం పార్టీ ఎన్నో ఉద్య‌మాలు, పోరాటాలు చేస్తోంద‌ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయ‌కులు వాసు, ద‌యాసాగ‌ర్‌, పేడూరు మ‌ల్లికార్జున‌,…

Read More

తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్…

వాకాడు మండ‌లం దుగ‌రాజప‌ట్నం గ్రామ పంచాయ‌తీలోని శ్రీ‌నివాసపురం గ్రామంలో మ‌ద్యం మ‌త్తులో క‌న్న‌తండ్రినే కుమారుడు క‌ర్ర‌తో దాడి చేసి చంపేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై వాకాడు పోలీసుస్టేష‌న్లో కేసు న‌మోదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టి…ముద్దాయి ర‌మేష్‌ను శ్రీ‌నివాసపురంలో అరెస్ట్ చేసిన‌ట్లు సీఐ హుస్సేన్‌బాషా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న స‌ర్కిల్ పోలీసు కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి కేసుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని…రిమాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. ఈ…

Read More

కోవూరులో వైభ‌వంగా కార్తీక మాసం

నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకొని…భ‌క్తులు శివ‌నామ స్మ‌ర‌ణ‌ల‌తో ఆల‌యంలో ప్ర‌ద‌క్ష‌ణాలు చేసి స్వామి వారిని ద‌ర్శించుకొని తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

Read More

టైంకి షాపులు మూసేయాలి…

నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ద‌ర్గా ప్రాంతంలో ఎస్ఐ ఏ సైదులు త‌న సిబ్బందితో క‌లిసి త‌నిఖీలు చేప‌ట్టారు. ద‌ర్గాకి విచ్చేసే భ‌క్తులు, యాత్రికుల‌కి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాత్రి స‌మ‌యంలో బీట్ పోలీసు సిబ్బంది విధుల‌ను ఎస్ఐ స్వ‌యంగా ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. దుకాణ‌దారులంద‌రూ త్వ‌ర‌గా మూసి వేయాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పనితీరు పట్ల…

Read More