- వైభవంగా పల్లకి సేవ
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక మాసంను పురస్కరించుకుని రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ పూజలకు అధిక సంఖలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం కార్యక్రమం మహిళలచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కోవూరు జనార్థన్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.