- రాపూరు ఎస్సై వెంకట్ రాజేష్
- సీవీకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు ఎస్సై వెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో… రాపూరు సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు రాపూరు పట్టణ ప్రజలకు విద్యార్థి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతయ్య, రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరీష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రాజేష్ మాట్లాడుతూ.. కాలేజీ విద్యార్థులు గంజాయి మాదకద్రవ్యాలకు జాగ్రత్తగా ఉండాలని , చెడు అలవాట్లకు బానిసై బంగారం వంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, కళాశాలలో యువ్టీజింగ్ వంటి టకార్యక్రమాలకు పాల్పడద్దని అదేవిధంగా సైబర్ నేరాకు , రోడ్డు ప్రమాదాలుకు ఇతర మత్తు పదాలకు దూరంగా ఉండాలని మీ తల్లిదండ్రుల మీ మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయాలని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా నడుచుకోవాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాయక్, విద్యార్థులు , విద్యార్థిని తల్లిదండ్రులు , ప్రజలు , కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.