- సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ
దుకాణాల్లో, అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ సూచించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సీఐ కార్యాలయంలో ఎన్3 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారస్తులతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ దుకాణంలో, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ దుకాణదారులకు సూచించారు. చోరీలు నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందన్నారు. పోలీసులకు ప్రజలంతా సహకరించాలని సీఐ మురళీకృష్ణ కోరారు.