- పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
- కలిగిరి, కొండాపురం, లింగ సముద్రం మండలాల్లో అవగాహన
- విద్యార్థులను చైతన్యపరిచిన ఎస్సైలు ఉమా శంకర్, వెంకట్రావు, మహబూబ్ సుభాని
సమాజంలో ప్రమాదకరంగా మారిన డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొడదామని పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ఎస్సైలు పిలుపునిచ్చారు. శుక్రవారం కలిగిరి, కొండాపురం, లింగ సముద్రం మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. కలిగిరిలో ఎస్సై ఉమాశంకర్, కొండాపురంలో వెంకట్రావు, లింగసముద్రంలో ఎస్సై మహబూబ్ సుభానిలు విద్యార్థులను చైతన్య పరిచారు. డ్రగ్స్ కు బానిసలవుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా కఠిన చట్టాలు ఉన్నాయని, వారు తెలిపారు. అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా చేసిన చర్యలు తీసుకుంటామని లింగసముద్రం ఎస్సై హెచ్చరించారు. వాగుల్లో జెసిబి లు పెట్టకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.