జగనన్న లే ఔట్ లో వ్యక్తి అనుమానస్పద మృతి

  • కావలి పట్టణ సమీపంలోని అట్టలప్యాక్టరీలో నివాసం ఉంటున్న శాంతి కుమార్ గా గుర్తింపు
  • సాయంత్రం 4 గంటల సమయంలో ఒక మహిళతో కలిసి జగనన్న లేఔట్ కి వచ్చిన శాంతి కుమార్
  • ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన కావాలి డిఎస్పి శ్రీధర్, రూరల్ సీఐ రాజేశ్వరరావు
  • హత్యగా అనుమానాలు, విచారణ చేస్తున్న పోలీసులు

నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు జగనన్న లే ఔట్ లో వ్యక్తి మృతి శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు హుటాహుటీన సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ముసునూరు వద్దనున్న అట్టలప్యాక్టరీలో నివాసం ఉంటున్న శాంతి కుమార్ గా గుర్తించారు. అతని చొక్కా రక్తంతో తడిసి ఉంది.కానీ ఎలాంటి రక్త గాయాలు లేవని, ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ శ్రీధర్ కూడా అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సాయంత్రం 4 గంటల సమయంలో ఒక మహిళతో కలిసి జగనన్న లేఔట్ కి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు భార్యను వదిలేసి, భర్తను వదిలేసిన ఆ మహిళతో కొద్ది కాలంగా తో సహచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళను విచారిస్తే అక్కడ ఏం జరిగిందనేది తెలుస్తుంది. అక్కడి గమనిస్తే అందరూ హత్యగానే భావిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి రూరల్ సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *