వారిని కూడా అరెస్ట్‌ చేయండి

  • టీడీపీ వాళ్ల‌కి ఓ న్యాయం.. వైసీపీ వాళ్ల‌కి మ‌రో న్యాయ‌మా?
  • నెల్లూరు నగరం వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారిపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వైసీపీ శ్రేణుల‌తో క‌లిసి వ‌చ్చి నెల్లూరు వేదాయ‌పాలెం పోలీస్‌స్టేష‌న్‌లో కాకాణి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన అనేకమంది అసభ్యకర పోస్టులు చేశారని కానీ తాము ఏనాడు వారిని ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని మండిప‌డ్డారు. వైసీపీ వారికి ఒక న్యాయం… టిడిపి వారికి మరో న్యాయంలా ఉందన్నారు. వైసీపీ నేత‌ల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం మంచి పద్ధతి కాదని హిత‌వుప‌లికారు. తాము అధికారంలో ఉన్నప్పుడే టిడిపి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులను ఆధారాలతో సహా నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *