- పొదలకూరు సిఐ. శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ . హనీఫ్
మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణం లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల నివారణ, ఈవ్ టీచింగ్- ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మోటార్ వెహికిల్ చట్టం, సీ.సీ కెమెరాల ఏర్పాటు పై పొదలకూరు ఎస్. ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ శివరామకృష్ణ రెడ్డి ,ఎస్.ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని 112 లేదా సమీపంలో పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.