- కావలి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ జన్మదినం
- ఆదరణ కేంద్రం, పాఠశాలలో, ఎస్టీ కాలనీ, ఏరియా వైద్యశాలలో సేవా కార్యక్రమాలు
కావలి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తన జన్మదిన వేడుకలను పేదలు, అనాధల ఆదరణ కేంద్రంలో పిల్లల మధ్యన జరుపుకున్నారు. ముంగమూరు ఆదరణ కేంద్రంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వారికి భోజనం, పోషకాహార సామాగ్రి అందజేశారు. అదే విధంగా కావలి ఏరియా వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు, భోజనం పంపిణీ చేశారు. 17వ వార్డు బుడంగుంట ఎస్టీ కాలనీలో భోజనం, నిత్యవసర సరుకులు అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు భోజనం, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు రాజకీయ భవిష్యత్తుకు కారణమైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనాధ పిల్లలు, పేదల మధ్య తన పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎంతో కృషి చేశారని వారికి అభినందనలు తెలిపారు.