డ్రగ్స్ కు బానిసలు కావద్దు…!జీవితాలను నాశనం చేసుకోవద్దు…!

  • కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో కావలి పోలీసు శాఖ అవగాహన
  • మత్తు పదార్థాల అనార్ధాలను వివరించిన కావలి డిఎస్పీ శ్రీధర్, రెండో పట్టణ సీఐ గిరిబాబు.

మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కావలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. కావలి పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కావలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు. వీటిని అమ్మినా, వాడినా పోలీసు శాఖ తీసుకునే చర్యలు, జరిగే నష్టాలను వివరించారు. అదేవిధంగా సెల్ ఫోన్లల్లో అనేక యాప్ లు ఉన్నాయని, వీటిల్లో చెడుకు దూరంగా ఉంటూ, మంచినే తీసుకోవాలన్నారు. కళాశాలకు ఒక లక్ష్యంతో రావాలని, బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. సీఐ గిరిబాబు మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడితే అది ఒక వ్యసనంలా మారుతుందని చెప్పారు. బాగా చదివి ఉద్యోగం సాధిస్తే తల్లిదండ్రులకు, మీ ఊరికి మంచి పేరు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం నాయుడు,సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ డైరెక్టర్ ఆర్. మాల్యాద్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *