
సురేష్రెడ్డి సేవలకు తార్కాణం
ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్గా బీజేపీ రాష్ట్రనేత సన్నపురెడ్డి సురేష్రెడ్డి గురువారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండులోని ఛైర్మన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీబొమ్మ నుంచి ఆర్టీసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బీజేపీ, బీజేపీ అనుబంధ సంఘాలు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు. దారిపొడవూనా.. మేళ తాళాలు, తప్పెట్లు.. దరువులు.. నినాదాల మధ్య భారీ ప్రదర్శన జరిగింది. అలాగే.. ఈ ర్యాలీలో కార్యకర్తలను ఉత్సాహపరిచేలా…..