నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట రైతు సేవ కేంద్రం నందు రైతులకు హార్టికల్చర్ పంటలైన నిమ్మా మరియు బొప్పాయి పంట సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి సైంటిస్టులు డాక్టర్ తిరుపాలు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి సలహాలు ఇచ్చారు. వీరు పంటలు సాగు యాజమాన్యం, ఎరువులు వాటికి అవసరమైన పురుగు మందుల గురించి వివరించడం జరిగింది. అలాగే రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు హార్టికల్చర్ అధికారి ఆనంద్, కలువాయి హార్టికల్చర్ అధికారి మృథిలా , విఏఏ శ్రీనివాసులు, విహెచ్ఏ నరేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.